పత్తి కొనుగోళ్లపై తొలగని ప్రతిష్టంభన
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య ఏర్పడిన సమస్య పరిష్కారం కోసం వ్యాపారులు నవంబరు 28న కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఛైర్పర్సన్ లక్ష్మీప్రసన్నకు కర్షకుల ఇబ్బందులు వివరిస్తున్న రైతుకూలీ సంఘం నాయకులు గుర్రం అచ్చయ్య తదితరులు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య ఏర్పడిన సమస్య పరిష్కారం కోసం వ్యాపారులు నవంబరు 28న కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ·రైతు సంఘాలు సైతం కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం వ్యవసాయ మార్కెట్లో పత్తి వ్యాపారులతో సమావేశమయ్యాయి. వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షుడు జీవై నరేశ్, దిగుమతిశాఖ అధ్యక్ష, కార్యదర్శులు దిరిశాల చిన వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్రావు, ఎగుమతిశాఖ అధ్యక్ష, కార్యదర్శులు నల్లమల ఆనంద్, చెరుకూరి సంతోష్కుమార్, ఛాంబర్ ఈసీ సభ్యులు, పలువురు కార్యదర్శులు, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య, జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు చర్చించారు. కొనుగోళ్లు జరపాలని మార్కెట్ పాలకవర్గం, అధికారులు, దిగుమతిశాఖ విజ్ఞప్తి చేసినా సమ్మెకే సిద్ధపడ్డారు. అధికారులు పత్తి మార్కెట్కు శుక్రవారమూ బంద్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఏఎంసీ ఛైర్పర్సన్ డౌలె లక్ష్మీప్రసన్న, వైస్ఛైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. మరోవైపు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి వ్యాపారులు కొనుగోళ్ల నిలిపివేతకు గురువారం అక్కడి అధికారులకు నోటీసులు ఇచ్చారు.
నేడు హైదరాబాద్లో చర్చలు:
పత్తి వ్యాపారుల సమస్య మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు దృష్టికి వెళ్లింది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ల పరిధిలోని పత్తి వ్యాపారులను చర్చల కోసం హైదరాబాద్కు శుక్రవారం ఆహ్వానించారు. కాటన్ ట్రేడర్స్ అండ్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసరావు, ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతిశాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్, కార్యదర్శి చెరుకూరి సంతోష్కుమార్ చర్చలకు హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదనపు సమయం.. ఓటుకు పోటెత్తాలి జనం
[ 09-05-2024]
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తద్వారా పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. -
నిఘా నేత్రం.. పర్యవేక్షణ సులభం
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రాలు అమర్చాలని ఎన్నికల సంఘం సూచించింది. -
‘కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్ చెప్పే బూటకపు మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
‘భాజపా గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పే’
[ 09-05-2024]
మరోసారి కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. -
ఓటు మేలు తలపెట్టవోయ్
[ 09-05-2024]
‘ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీని సద్వినియోగం మనందరి బాధ్యత. అయిదేళ్లు పాలించాల్సిన ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో నిర్ణయించుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యం మన చేతుల్లోనే పెట్టింది. -
వేగ గణనకు వేదగణితం
[ 09-05-2024]
తెలంగాణ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో ‘జిజ్ఞాస’ విద్యార్థి కేంద్రక అధ్యయన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
[ 09-05-2024]
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
వానాకాలం వరి సాగు జోరు!
[ 09-05-2024]
వర్షాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగా సిద్ధం చేశారు. గత సీజన్తో పోల్చిచూస్తే ఈ సారి వరి విస్తీర్ణం ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రేపటి వరకు గడువు పొడిగింపు
[ 09-05-2024]
ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని శుక్రవారం వరకు ఎన్నికల సంఘం పొడిగించిందని ఖమ్మం లోక్సభ స్థానం ఆర్ఓ గౌతమ్ బుధవారం ప్రకటించారు. -
నేడు తమిళిసై రోడ్షో
[ 09-05-2024]
మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్కు మద్దతుగా ఆపార్టీ నాయకురాలు తమిళిసై ఇల్లెందులో గురువారం రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బలగాని గోపీకృష్ణ బుధవారం తెలిపారు.