మన భవితను నిర్ణయిస్తుంది
మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు.
- యెల్ద్దండి వేణు, సినీ నటుడు, దర్శకుడు
మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వెళ్లి కచ్చితంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి. ఆలోచించి సమర్థ నేతకు ఓటేయండి. అప్పుడే నిజమైన నాయకులు ఎన్నికవుతారు.
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం
కండువా మారింది.. మాట జాగ్రత్తండి
ఇప్పుడు ఎక్కడ చూసినా పార్టీలు మారుతున్న నాయకులు, కార్యకర్తలు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. ఈ రోజు ఓ పార్టీలో ఉంటే మరుసటి రోజు వేరే పార్టీలో చేరుతున్నారు. కండువాలు మార్చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అంతకుముందు ప్రత్యర్థి పార్టీని దుమ్మెత్తి పోయగా.. ఇప్పుడదే పార్టీలో చేరి జై కొట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆ గట్టు నుంచి ఈ గట్టుకొచ్చామన్న సంగతి మరచి అవతలి వారే జై కొడుతున్న ఘటనలు అడపాదడపా జరుగుతున్నాయి. ఇదే అదునుగా రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు సోషల్ మీడియా వాలంటీర్లు. అందుకే ఈ విషయంలో కాస్త పైలంగా ఆలోచించి మాట్లాడితే మంచిది.
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ
ఓటు హక్కు 21 నుంచి 18 ఏళ్లకు...
అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కును 1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కు వినియోగించుకునే వారు. దాన్ని 18 ఏళ్లకు మార్చాలని చాలాకాలంగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ హయాంలోని ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. అప్పటి నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
పెద్దశంకరంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిని ఒడిసిపట్టరు.. మరమ్మతు కనరు!
[ 18-06-2024]
సాగు, తాగుకు ప్రధానమైన నీటి వనరుల అభివృద్ధికి నిధులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ఏళ్ల కిందట మరమ్మతు, ఇతర పనులకు నిధులు కేటాయించగా, ఆ తర్వాత మంజూరు లేక చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. -
తవ్వకాల్లో అక్రమార్కులు.. చోద్యం చూస్తున్న అధికారులు!
[ 18-06-2024]
అసైన్డు భూముల్లో అక్రమంగా మట్టి, మొరం తవ్వకాలు జరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రైతులకు ప్రభుత్వం వీటిని కేటాయించింది. అయితే సాగుకు యోగ్యంగా లేవని వృథాగా ఉంచడంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. -
డిగ్రీ కళాశాల లేక.. చదువు ముందుకు సాగక..
[ 18-06-2024]
అందుబాటులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఏటా ఇంటర్మీడియట్లో అధికశాతం ఉత్తీర్ణత ఉంటున్నా, అందుకు తగ్గట్టుగా డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. -
ఉపాధికి భరోసా.. భవిత ధీమా
[ 18-06-2024]
విద్యార్థి దశలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్డీసీ) ఆధ్వర్యంలో వివిధ కోర్సులను ప్రవేశపెడుతోంది. -
‘భగీరథ’ ఇంటింటికీ చేరుతోందా?
[ 18-06-2024]
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.వేల కోట్లు వెచ్చించింది. -
కొనసాగుతున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ
[ 18-06-2024]
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించాయి. స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు గుర్తించడంతో బదిలీల కోసం సీనియార్టీ జాబితాను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
రూ.16,742 కోట్లతో.. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
[ 18-06-2024]
జిల్లా యంత్రాంగం వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ నివేదికను త్వరలో కలెక్టర్ ఆమోదించి ఆవిష్కరించనున్నారు. జిల్లాలో 31 బ్యాంకులున్నాయి. వాటి పరిధిలో 250 శాఖల ద్వారా అన్ని వర్గాల వారికి సేవలు, లావాదేవీలు నిర్వహిస్తున్నారు. -
అల్లాహ్కు ప్రార్థన.. పేదలకు ఖుర్బానీ
[ 18-06-2024]
సిద్దిపేటలో బక్రీద్ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు సోమవారం ప్ర£త్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పేదలకు ఖుర్బానీ ఇచ్చి తమ ఔదార్యాన్ని చాటారు. -
బీమా కొత్తకొత్తగా.. కసరత్తులో యంత్రాంగం
[ 18-06-2024]
చిరుజల్లులు కురవగానే రైతన్నలు సంతోషంతో పొలం పనులు ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు. ప్రకృతి వైపరీత్యాలకు చేతికి వచ్చే దశలో పంటలు నాశనమవుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీట్ వివాదంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారు?
-
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
ఆల్టైమ్ గరిష్ఠాలకు సూచీలు.. 23,500 ఎగువన ముగిసిన నిఫ్టీ
-
పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారు: ఎమ్మెల్సీ అనురాధ
-
5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్లు.. భారత్ కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు
-
డిప్యూటీ సీఎం పవన్కు అమరావతిలో ఘనస్వాగతం