క్యాంపు రాజకీయాలు షురూ!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు రోజులే గడువు ఉండటంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న తమ ఓటర్లను అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. విజయం
ఈనాడు, నల్గొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు రోజులే గడువు ఉండటంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న తమ ఓటర్లను అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. విజయం లాంఛనమే అయినా.. ఏ అవకాశాన్ని వదలకూడదనే తలంపుతో తెరాస ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపు బాధ్యతను తెరాస అధిష్ఠానం అప్పగించటంతో మంత్రి జగదీశ్రెడ్డి అన్నీ తానై సాగుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 12 నియోజకవర్గాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. చివరి అస్త్రంగా ప్రజాప్రతినిధులందరినీ శిబిరాలకు పంపించారు. మంగళ, బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల సందర్శిస్తారు. గురువారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకొని అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓటర్లు తమ ఎమ్మెల్యేలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు శుక్రవారం చేరుకోనున్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం సమావేశమై ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల్లో 1,271 ఓట్లు ఉండగా.. సుమారు 980 ఓట్లు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ మద్దతుపై నగేశ్ ఆశలు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆలేరు జడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నగేశ్ ఆపార్టీ అధికారికంగా తనకు మద్దతు ప్రకటిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలే ఉన్నా ఆపార్టీ నుంచి అధికారిక అభ్యర్థి లేకపోవడం మంచి పరిణామం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు పార్టీ తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని మాజీ మంత్రి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. మరోవైపు తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నా.. స్వతంత్ర అభ్యర్థి నగేశ్ ఒక్కరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. మరోవైపు తెరాస నేతలు తమను సంప్రదిస్తారేమోనని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆశగా చూస్తున్నారు. ‘‘గతంలో రెండు పార్టీల బలాబలాలు సమానంగా ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు ఏకపక్ష మెజార్టీ ఉంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు మాకు ఓటేస్తామంటే సరే. కానీ మేం ఎవరినీ సంప్రదించడం లేదు’’ అని ఓ తెరాస ఎమ్మెల్యే ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..