క్యాంపు రాజకీయాలు షురూ!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు రోజులే గడువు ఉండటంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న తమ ఓటర్లను అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. విజయం
ఈనాడు, నల్గొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు రోజులే గడువు ఉండటంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న తమ ఓటర్లను అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. విజయం లాంఛనమే అయినా.. ఏ అవకాశాన్ని వదలకూడదనే తలంపుతో తెరాస ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపు బాధ్యతను తెరాస అధిష్ఠానం అప్పగించటంతో మంత్రి జగదీశ్రెడ్డి అన్నీ తానై సాగుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 12 నియోజకవర్గాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. చివరి అస్త్రంగా ప్రజాప్రతినిధులందరినీ శిబిరాలకు పంపించారు. మంగళ, బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల సందర్శిస్తారు. గురువారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకొని అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓటర్లు తమ ఎమ్మెల్యేలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు శుక్రవారం చేరుకోనున్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం సమావేశమై ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల్లో 1,271 ఓట్లు ఉండగా.. సుమారు 980 ఓట్లు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ మద్దతుపై నగేశ్ ఆశలు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆలేరు జడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నగేశ్ ఆపార్టీ అధికారికంగా తనకు మద్దతు ప్రకటిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలే ఉన్నా ఆపార్టీ నుంచి అధికారిక అభ్యర్థి లేకపోవడం మంచి పరిణామం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు పార్టీ తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని మాజీ మంత్రి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. మరోవైపు తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నా.. స్వతంత్ర అభ్యర్థి నగేశ్ ఒక్కరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. మరోవైపు తెరాస నేతలు తమను సంప్రదిస్తారేమోనని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆశగా చూస్తున్నారు. ‘‘గతంలో రెండు పార్టీల బలాబలాలు సమానంగా ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు ఏకపక్ష మెజార్టీ ఉంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు మాకు ఓటేస్తామంటే సరే. కానీ మేం ఎవరినీ సంప్రదించడం లేదు’’ అని ఓ తెరాస ఎమ్మెల్యే ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఆటో డ్రైవర్ డ్రెస్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమారెడ్డి ప్రచారం నిర్వహించారు. -
హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి
[ 08-05-2024]
భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాకర్స్ను కలిసి మాట్లాడారు. -
సమీక్షిస్తూ.. సౌకర్యాలు ఆరా తీస్తూ..!
[ 08-05-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. -
ప్రైవేటు పనులకు.. ప్రభుత్వ పరికరాలు
[ 08-05-2024]
జిల్లాలోని విద్యుత్తు సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులతో విద్యుత్తుశాఖ సిబ్బంది కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వ పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. -
ఓటు వేసేందుకు గుర్తింపుకార్డు తప్పనిసరి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. -
పార్టీలు చిన్నవైనా.. ప్రభావం పెద్దది
[ 08-05-2024]
గడిచిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు చిన్నవైనా ప్రభావం పెద్దగానే చూపిన ఘటనలున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిన వైనం లేకపోలేదు. -
గెలిస్తే ఐదేళ్లకు సరిపడా ప్రగతి ప్రణాళికలు
[ 08-05-2024]
‘ మాది ప్రజలకు సేవ చేసే కుటుంబం. 30 ఏళ్ల క్రితం జానారెడ్డి హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరిగింది. ఇప్పుడు గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో నేను చేసిన పనులు చేప్పే ఓట్లడుగుతాను. -
ఓటుకు సెలవివ్వొద్దు..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. -
విదేశాల్లో ఓటుహక్కు ఇలా..
[ 08-05-2024]
ఓటు హక్కు సద్వినియోగంపై ఎన్నికల సంఘం అధికారులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ పోలింగ్ శాతం పెంపు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. -
26 రోజుల పోరాటం.. 22 రోజులకు ఫలితం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల పాట్లు మామూలుగా లేవు. నెలన్నర పాటు ఎన్నికల ప్రక్రియ నడవడం వారికి పరీక్షా సమయంగా మారింది. -
చివరి భూములకూ సాగు నీరందిస్తాం: జానారెడ్డి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో, కార్నర్ సమావేశం నిర్వహించారు. -
సేవ చేద్దాం.. ఆనందాలు పంచుదాం!
[ 08-05-2024]
కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్ క్రాస్’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్ క్రాస్ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. -
శోభాయమానం.. నవ నృసింహుల సాలహారం
[ 08-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో నవ నృసింహుల దివ్య స్వరూపాలతో సాలహారం నిర్మించాలన్న భక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఇక్కడి రాజ గోపురానికి ఇరువైపులా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తొమ్మిది నారసింహ క్షేత్రాల్లోని స్వయంభువులను ఆలయ ప్రాకారంలో తీర్థజనులు సందర్శించేలా తీర్చిదిద్దారు. -
అక్రమ రవాణాకు చెక్
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, విలువైన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. -
ఫిర్యాదు వచ్చిందా.. చిటికెలో పరిష్కారం
[ 08-05-2024]
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు. -
వర్షాలకు రూ.80 లక్షల నష్టం: ఎస్ఈ
[ 08-05-2024]
అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్తు శాఖకు రూ.80 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆ శాఖ ఎస్ఈ పాల్రాజు తెలిపారు. -
నిత్య కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ఆరాధన
[ 08-05-2024]
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. -
వారి భవిత రాసేది.. యువతే..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. తమ రాతను ఎలా మార్చుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. -
వేసవి శిబిరం.. క్రీడలకు ఊతం
[ 08-05-2024]
వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు బాలలతో సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్