పదహారేళ్లైనా పూర్తి కాలేదుగా..
నల్గొండ జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన ఎస్సెల్బీసీ సొరంగమార్గ పనులు 16 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.
దేవరకొండ, చందంపేట, న్యూస్టుడే
తెల్దేవరపల్లి గ్రామ సమీపంలో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న సొరంగమార్గం-2
నల్గొండ జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన ఎస్సెల్బీసీ సొరంగమార్గ పనులు 16 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలం మిగులు జలాలను సొరంగమార్గం ద్వారా ఇక్కడికి తీసుకువచ్చి 3.50 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు 2005లో అప్పటి ప్రభుత్వం రూ.1925 కోట్ల వ్యయంతో రెండు జిల్లాల సరిహద్దులో సొరంగమార్గం పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనులను ఓ నిర్మాణ సంస్థ టెండరు దక్కించుకుంది. చందంపేట మండల తెల్దేవరపల్లి గ్రామ సమీపంలో 7.25 కిలోమీటర్ల సొరంగమార్గం-2 తవ్వకాల పనులను ఉప గుత్తేదారుగా మరో కంపెనీకి రూ.131 కోట్ల వ్యయంతో అప్పగించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో సొరంగమార్గం పనులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రాజెక్టు స్వరూపం ఇలా..
* శ్రీశైలం మిగులు జలాలు 7.25 టీఎంసీలను నక్కలగండి వద్ద చేపడుతున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిల్వ చేయాలి.
* రిజర్వాయర్ నుంచి నక్కలగండి సొరంగమార్గం-2 ద్వారా పెండ్లిపాకల ప్రాజెక్టుకు తరలించి, అక్కడి నుంచి ఏకేబీఆర్ ప్రాజెక్టుకు మళ్లించాలి.
* 2005లో రూ.1925 కోట్లకు రూపకల్పన చేయగా.. ప్రస్తుతం రూ.4వేల కోట్లకు పెంచారు.
* 43.75 కి.మీకు 9 కి.మీ సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది.
కొత్త ఉప గుత్తేదారులకు పనులు అప్పగింత
16 ఏళ్ల విరామం తర్వాత సొరంగమార్గం-2 కాంక్రీట్ పనులకు ఓ నిర్మాణ సంస్థ నిర్వాహకులకు ప్రధాన నిర్మాణ సంస్థ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాదాపు 3 కి.మీ కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంది. వీటిని చేపట్టేందుకు ఈ నెల 1న తెల్దేవరపల్లి గ్రామ సమీపంలోని సొరంగమార్గానికి వివిధ వాహనాలను తరలించారు.
2023 డిసెంబరు నాటికి కాంక్రీటు పనులు పూర్తి
- చక్రపాణి, నీటిపారుదలశాఖ డీఈ
ఏళ్ల తరబడిగా నిలిచిపోయిన కాంక్రీటు పనులు పూర్తి చేసేందుకు సన్బీమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్వాహకులు 2023 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు పనులు ప్రారంభించారు. పాత ఉప గుత్తేదారులకు బకాయి వ్యవహారంలో పనులు నిలిపివేసినట్లు తెలుస్తుంది. పనులు నిలిపివేయకుండా చర్యలు చేపడుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.