విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని బేతర్ సింగ్ గ్రామంలో జరిగింది.
పర్లాఖెముండి : విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని బేతర్ సింగ్ గ్రామంలో జరిగింది. ఠాణా అధికారి బసంత్ శెఠి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రమోద్ దోలాయ్ (60) శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో రహదారిపై పడి ఉన్న విద్యుత్వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్రమోద్ దోలాయ్ ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి చూశారు. రహదారిపై పడి ఉన్న ప్రమోద్ దోలాయ్ను గమనించిన కుటుంబసభ్యులు.. మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ప్రమోద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
బరంపురం: గంజాం జిల్లా, బుగుడ బ్లాక్లోని తలోసాకరో గ్రామానికి చెందిన రైతు అరున్ నాయక్(37) మృతి చెందారు. నిన్న రాత్రి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి వన్యప్రానుల వేటకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.