హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.
ఒంగోలు, న్యూస్టుడే: ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఎన్నికల వేళ ఇలాంటి విచిత్రాలు తరచూ కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు వివాదాలూ తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో కొత్తపట్నం మండలం మడనూరు పంచాయతీ పరిధిలోని స్వర్ణాంధ్ర పట్టపుపాలెం ఊరి పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ‘మీ ఓటు మీ ఇష్టం. నచ్చిన వాళ్లకు వేసుకుంటే లేదు మాకేం కష్టం... అభ్యంతరం. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది. ఊరి పెద్దలుగా మేమూ గౌరవిస్తాం. అంతే తప్ప పదేపదే పార్టీల కండువాలు మార్చి రచ్చ చేస్తామంటే ఊరుకోం. ఊరి పరువు బజారున పడేసేలా వ్యవహరిస్తే సహించం. రాజకీయ పార్టీలు వాళ్ల ప్రయోజనాల కోసం ఎన్నో ఎత్తులు వేస్తుంటాయి. నాయకులు జిత్తులు ప్రదర్శిస్తుంటారు. ఆ మాయలో పడొద్దు. మీ ఓటేదో మీరు వేసుకోండి. అలాకాకుండా పార్టీల కండువాలు పదే పదే వివాదాలు తెస్తే.. ఊళ్లో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తే మాత్రం ఊరుకోం. రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త’... అంటూ పెద్దలు తీర్మానించారు.
28 నుంచి ఓటర్లకు స్లిప్పులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: మే 13న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 28 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్వోలు ఇంటింటా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 15 వరకు ఓటర్ల చేర్పుల నిమిత్తం దరఖాస్తులు స్వీకరించారు. వీటిపై బీఎల్వోలు విచారణ ప్రక్రియ పూర్తి చేసి అరులైన వారికి ఓటు హక్కు కోసం సిఫార్సు చేశారు. తాజాగా విడుదలైన ఓటర్ల తుది జాబితా ఆధారంగా సీరియల్ నంబరు, పోలింగ్ కేంద్రం తదితర సమాచారంతో కూడిన స్లిప్పు అందజేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.