‘ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదు’
వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం లావేరు మండలం సుభద్రాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద
లోకేశ్ జన్మదినం సందర్భంగా కేక్ కోసి వేడుకలు చేస్తున్న కళా, తదితరులు
లావేరు గ్రామీణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం లావేరు మండలం సుభద్రాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కోశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళా మాట్లాడుతూ అమ్మఒడి పథకం ఎక్కడికి పోయిందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, దీనికి ముగింపు పలకాలంటే యువత నడుం బిగించాలన్నారు. ఈ మూడేళ్లలో రహదారుల మరమ్మతుకు ఒక్కపైసా ఖర్చు చేయలేదన్నారు. ప్రతిఒక్కరిపైనా కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నేతలు ముప్పిడి సురేష్, పి.మధుబాబు, ప్రకాశరావు, మహేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ మారారని నీటి సరఫరా నిలిపివేత
[ 21-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి మారామని కక్ష గట్టి పైపులైన్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను నిలిపేశారంటూ గ్రామానికి చెందిన వజ్జ లోకేశ్వరరావు ఎంపీడీవో జి.భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థి గృహ నిర్బంధం
[ 21-05-2024]
వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను నందిగాం పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితివూరులో గృహ నిర్బంధం చేశారు. -
మహేంద్రతనయ నదిలో దిగి కొసమాల వాసి జలసమాధి
[ 21-05-2024]
గజపతి జిల్లా గోసాని బ్లాక్లోని బాగుసాల పంచాయతీ సదర్ మహకుమా గ్రామం గుండా ప్రవహించే మహేంద్రతనయ నదిలో పడి ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
[ 21-05-2024]
పాతపట్నం మండలం కోదూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్