Warangal : అనుమానస్పద స్థితిలో ఎనిమిది నెమళ్లు మృతి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో శుక్రవారం ఎనిమిది నెమళ్లు మృతి చెందాయి. దేవిలాల్ తండా శివారులో......
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో శుక్రవారం ఎనిమిది నెమళ్లు మృతి చెందాయి. దేవిలాల్ తండా శివారులో అనుమానాస్పదంగా ఎనిమిది నెమళ్లు మృతి చెందాయని సమాచారం అందినట్లు వర్దన్నపేట అటవీ అధికారి సదానందం తెలిపారు. సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి సంఘటనాస్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మృతి చెందిన నెమళ్లకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్కు తరలించినట్లు తెలిపారు. వీటి మృతికి వ్యవసాయ పొలాలకు వాడే పురుగు మందు లేదా ప్రస్తుతం వ్యాపించే బర్డ్ ఫ్ల్యూ వ్యాధి కావొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే, నెమళ్ల మృతికిపై పోస్టుమార్టం తర్వాతే స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై కిషోర్కు సమాచారం అందించినట్లు సదానందం పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లెక్క తేలింది!
[ 29-05-2024]
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా 73.80 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ప్రాథమిక సమాచారం అందినా మంగళవారం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడయ్యాయి -
రైతుబజారులో దోపిడీ పర్వం
[ 29-05-2024]
సంగెం మండలం గాంధీనగర్కు చెందిన ఓ రైతు వారం రోజుల క్రితం కూరగాయలు విక్రయించేందుకు రైతుబజారుకు వచ్చారు. -
పుట్టి ముంచుతున్న బొందివాగు నాలా!
[ 29-05-2024]
వరంగల్ ప్రాంతం హంటర్రోడ్ బొందివాగు నాలాతో ముంపు పొంచి ఉందని గ్రేటర్ వరంగల్ ఇంజినీర్లు నిర్ధారించారు. నాలా విస్తీర్ణం తక్కువగా ఉండటంతో వర్షాకాలంలో వరద ప్రవాహంతో సమీపంలో ఉన్న కాలనీలు నీటమునుగుతున్నాయని తేల్చారు. -
మల్లన్నదే వైభోగం!
[ 29-05-2024]
జానపదుల జన జాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. వరంగల్ నగరానికి 15 కిలో మీటర్ల దూరంలోని ఐనవోలు మండల కేంద్రంలో కొలువైన మల్లికార్జునస్వామి భక్తుల కొంగు బంగారంగా నీరాజనాలు అందుకుంటున్నారు. -
విత్తన దుకాణాలపై టాస్క్ఫోర్స్ దాడులు
[ 29-05-2024]
వరంగల్ నగరంలోని విత్తన దుకాణాలపై మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వ్యవసాయశాఖ, టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక దాడులు చేశాయి -
వారధి నిర్మిస్తేనే రాకపోకలు
[ 29-05-2024]
ఏటూరునాగారం మండలంలోని కొండాయి-ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్యనున్న రహదారి కనుమరుగైంది. కొండాయి నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దారి అడవిలోంచి ఉంటుంది. -
ఏడు కొత్త బడులకు శ్రీకారం..!
[ 29-05-2024]
రాష్ట్రంలో మూతపడిన పాఠశాలలను పునఃప్రారంభించాలని, ప్రతి పంచాయతీలో ప్రాథమిక పాఠశాల ఉండేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. -
అమ్మకు అండగా.. సేవలు మెండుగా!
[ 29-05-2024]
గ్రామీణ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అవసరమైన వైద్య పరికరాలను ప్రాథమిక స్థాయిలోనే అందుబాటులో ఉంచుతున్నాయి -
భూ పట్టా.. అక్రమాల చిట్టా!
[ 29-05-2024]
భూమిని దున్నుకుని.. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసేది రైతులు... కానీ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ప్రక్షాళన సమయంలో అవినీతి రుచిమరిగిన అధికారులు చేసిన అక్రమాలకు అనర్హులు ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారు. -
పడకేసిన ఆదర్శం
[ 29-05-2024]
దివంగతులైన వారిని గౌరవంగా సాగనంపేందుకు శ్మశాన వాటికల్లో సకల సదుపాయాలు ఉండాలనే ఆశయంతో పురపాలికల పరిధిలో ‘ఆదర్శ వైకుంఠధామం’ నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని మంజూరు చేసింది. -
గ్రామీణం ఓటెత్తింది.. పట్టణం వెనకబడింది!
[ 29-05-2024]
ఓటు వినియోగంలో గ్రామీణ ఓటర్లు మరోసారి తమదైన చైతన్యాన్ని ప్రదర్శించారు. పట్టణవాసులు మరోసారి నిరాసక్తతను ప్రదర్శించారు. -
నమ్మించి.. బురిడీ కొట్టించి..!
[ 29-05-2024]
మంచివాడిగా నటిస్తూ.. పరిచయాలు పెంచుకున్నాడు. బ్యాంకులో అప్రైజర్గా చేరి అధికారులు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ నమ్మించాడు. అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్ల విలువైన బంగారం మాయం చేశాడు.