రైళ్ల రద్దు.. ‘ప్యాసింజరు’కు కష్టాలు
రెండు నెలలుగా ప్యాసింజరు రైళ్లు (ఇప్పుడు వీటిని ఎక్స్ప్రెస్లుగా పిలుస్తున్నారు) నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు నెలలుగా ప్యాసింజరు రైళ్లు (ఇప్పుడు వీటిని ఎక్స్ప్రెస్లుగా పిలుస్తున్నారు) నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్లేవారికి చౌక ప్రయాణ సాధనాలుగా ఇవి ఉండేవి. మూడోలైను పనులను కారణంగా చూపుతూ ఏడాది కాలంగా అనేక రైళ్లను రద్దు చేస్తూ వస్తున్నారు. ఈ ప్రకటనలు చివరి నిమిషంలో విడుదల చేస్తుండడంతో సమాచారం సైతం ప్రయాణికులకు తెలియడం లేదు. కొత్త పట్టాలు వేయడానికి నెలలకొద్ది జాప్యం చేస్తుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేం లేక రోజువారీ ప్రయాణికులు రోడ్డు మార్గంలో ఇతర రవాణా సాధనాలను ఆశ్రయిస్తున్నారు. ఇది రైల్వేకు భవిష్యత్తులో ప్రమాదకరంగానూ మారవచ్చు.
న్యూస్టుడే, కాజీపేట
‘జూన్ 18 నుంచి క్రమంగా రామగిరి, బల్లార్షా, డోర్నకల్, సింగరేణి, హైదరాబాద్ పుష్పుల్ రైళ్లను రద్దు చేస్తూ ప్రతి రెండు వారాలకు ఒకసారి దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు రద్దు గడువు ఉంది. ఇప్పటికైనా వీటిని పునరుద్ధరిస్తారా లేదా అని ప్రయాణికులు వేచి చేస్తున్నారు. శుక్రవారం వరకు రైల్వే నుంచి ఏ ప్రకటనా రాలేదు’
జీవితాలతో ముడిపడి: చౌకగా, సుఖంగా, తక్కువ సమయంలో గమ్యం చేర్చే ప్యాసింజరు రైళ్లు ప్రయాణికుల జీవితాలతో ముడిపడి ఉంటాయి. పేదలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అమ్ముకునే చిరువ్యాపారులు ఎక్కువగా వీటిపై ఆధారపడతారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లను కాకుండా కేవలం ప్యాసింజరులనే రద్దు చేయడం వెనుక రహస్యం తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం సౌకర్యవంతంగా రామగిరి..
రోజూ ఉదయం బల్లార్షా మార్గంలో కాజీపేట నుంచి ప్రయాణికులు వెళ్లడానికి రామగిరి అత్యంత అనువైనది. దీని తర్వాత ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లు ఉన్నా ఉదయం 9 గంటలలోపు జమ్మికుంట, ఓదేల, మంచిర్యాల, రామగుండం ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా ఉంటుంది. పనులు పూర్తి చేసుకుని సాయంత్రం కాగజ్నగర్ లేదా, సింగరేణికి తిరిగి రావొచ్చు. రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డు మార్గంలో రెండు మూడు బస్సులు మార్చాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికులకు దూరాభారం.
రామా.. ఇవేమి ప్రయోగాలు..
బల్లార్షా మార్గంలోని ప్రయాణికులు భద్రాచలం, కొత్తగూడెం వెళ్లడానికి ఒకే ఒక రైలు సింగరేణి ఎక్స్ప్రెస్. దీని మీద రైల్వే మొదటి నుంచీ ప్రయోగాలు చేస్తోంది. ముందుగా బల్లార్షా నుంచి కాజీపేట రైల్వే స్టేషన్కు వచ్చి భద్రాచలం రోడ్డుకు వెళ్లేది. దీంతో ఆలస్యం అవుతుందని కాజీపేట వంతెన కింద కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ను నిర్మించి అక్కడి నుంచే రైలును నేరుగా వరంగల్ మీదుగా భద్రాచలం రోడ్డుకు పంపుతున్నారు. దీనికి మామూలుగా ప్యాసింజరు రైలు కోచ్లు ఉండేవి. వాటిని తొలగించి పుష్పుల్గా మార్చారు. దూర ప్రాంత రైలు కాబట్టి ప్రయాణికుల వినతి మేరకు రెండు మూత్రశాలలు ఏర్పాటు చేశారు. తర్వాత బల్లార్షా మార్గంలో ఏ చిన్న పనులు జరిగినా ఈ రైలును రద్దు చేస్తూ వస్తున్నారు. భద్రాచలం వెళ్లడానికి బల్లార్షా మార్గంలో ప్రయాణికులు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి డోర్నకల్ లేదా ఖమ్మం, విజయవాడకు వెళ్లి అక్కడ నుంచి భధ్రాచలం వెళుతున్నారు. వీరి కష్టాలు రాముల వారికే తెలియాలి.
సికింద్రాబాద్ పుష్పుల్ లేక ఇబ్బందులు
వరంగల్ నగరం నుంచి రోజూ మధ్యాహ్నం సికింద్రాబాదు వెళ్లడానికి పుష్పుల్ చాలా అనువైన చౌకైన రైలుగా ఉండేది. ఇప్పుడు ఉదయం మాత్రమే నడుపుతూ మధ్నాహ్నం రద్దు చేయడం వల్ల రాజధానిలో ఉద్యోగాలు చేసుకునే వారు వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు. పుష్పుల్ రైలులో సికింద్రాబాదు వెళ్లడానికి రూ.60 మాత్రమే. బస్సుల్లో రూ.350 వరకు పెట్టి వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.
- ఈ విషయంపై రైల్వే అధికారులతో మాట్లాడగా.. బల్లార్షా, విజయవాడ మార్గంలో కొత్తగా రైలు పట్టాలను నిర్మిస్తున్నందున ఈ సమస్య ఉత్పన్నమౌతోందని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారులకు విన్నవించామని.. త్వరలో రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు.
ప్రయాణికుల కష్టాలు గుర్తించరా..
ప్యాసింజరు రైళ్లు రద్దు చేసినప్పుడు ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. చిన్న రైల్వే స్టేషన్లలో ఇవి ఆగవు కాబట్టి అక్కడి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రైల్వే స్టేషన్లకు కూడా ప్రాధాన్యం లేకుండా పోతోంది. రైళ్లు ఆగనప్పుడు అవి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది.
ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు
ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలి..
నేను రోజూ ఓదెల నుంచి కాజీపేట, వరంగల్కు వస్తుంటాను. ఓదెలలో ఆగే ప్యాసింజరు రైల్లు రెండు నెలలుగా రద్దు చేస్తున్నారు. కాజీపేటకు రావడానికి మంచిర్యాల లేదా రామగుండం, పెద్దపల్లికి వెళ్లి అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల ద్వారా రావాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రయాణికుల సమస్య తీర్చాలి.
కలవేని శ్రీనివాసు ఓదేల ప్రయాణికుడు
అజ్నీ ప్యాసింజరులో (బల్లార్షా ఎక్స్ప్రెస్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతికించు..స్ఫూర్తిని పంచు!
[ 14-06-2024]
నైతిక విలువల ఆధారంగా ఒకరి శరీరంలో ఉన్న అవయవాలు (కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం) మరొకరి అవసరానికి వాడదల్చుకున్నప్పుడు, వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు -
ఇద్దరిని బలిగొన్న ఇసుక ట్రాక్టర్
[ 14-06-2024]
విలాసాగర్- దామెరకుంట మధ్య దుబ్బపల్లి గ్రామ సమీపంలో గురువారం ఓ ఇసుక ట్రాక్టర్ ఇద్దరిని బలిగొంది. -
బాలుర పరిశీలన గృహంలో అధికారుల మద్యం విందు!
[ 14-06-2024]
వరంగల్ బాలుర పరిశీలన గృహం (అబ్జర్వేషన్ హోం)లో సిబ్బంది బాధ్యతలు మరచి మద్యంతో విందు చేసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది -
సమస్యను చూశారు.. పరిష్కారం చూపారు!
[ 14-06-2024]
గురువారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో కాల్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పంట క్షేత్రాలకు వెళ్లిన అన్నదాతలు తమ చరవాణుల నుంచి వీడియోకాల్ చేసి తమ సమస్యను చూపుతూ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. -
టౌన్ ప్లానింగ్లో వసూళ్లపై కమిషనర్ ఆరా
[ 14-06-2024]
-
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
[ 14-06-2024]
నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథులు కరవయ్యారు. -
ఓరుగల్లు రైల్వేస్టేషన్కు కొత్తందాలు
[ 14-06-2024]
వరంగల్ రైల్వేస్టేషన్లో ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద రూ.25.41 కోట్ల వ్యయ ప్రణాళికతో పునరాభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. -
లక్నవరంలో పర్యాటకులకు భద్రత కరవు
[ 14-06-2024]
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం సందర్శనకొచ్చే పర్యాటకులకు భద్రత కరవైంది. -
అంగన్వాడీ.. పిల్లల భవిష్యత్తుకు వారధి
[ 14-06-2024]
బుడిబుడి అడుగుల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వారధులుగా అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది -
కొత్త రేషన్కార్డులపై చిగురిస్తున్న ఆశలు..!
[ 14-06-2024]
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు(రేషన్కార్డులు) జారీ చేస్తోంది. రేషన్కార్డులపై రాయితీ బియ్యంతో పాటు గతంలో అన్ని రకాల నిత్యావసరాలనూ పంపిణీ చేసేవారు. -
వామ్మో గుడుంబా..!
[ 14-06-2024]
అధికారులు గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తుండడంతో జిల్లావాసులు హర్షిస్తున్నా.. మరోవైపు దాని తయారీకి అవసరమైన బెల్లం రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆశిస్తున్నారు -
బస్సుల కొరత.. ప్రయాణికుల వెత
[ 14-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/06/24)
-
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే
-
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్