గండి పునర్నిర్మాణ పనులు షురూ!
రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.5 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. తమిళనాడుకు
రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.5 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. తమిళనాడుకు చెందిన నటరాజన్ కన్స్ట్రక్షన్ సంస్థ టెండర్ దక్కించుకుంది. గండిక్షేత్రం కోటి రూపాయలు డిపాజిట్ చేయగా.. దేవాదాయశాఖ సర్వశ్రేయోనిధి నుంచి రూ. 13.5 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం రూ.14.5 కోట్లకు టెండర్లు ఖరారు చేసి గత డిసెంబరులో పనులు మొదలు పెట్టారు. జనవరినెలాఖరుకి ఆలయ కట్టడాలను పడకొట్టడం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నూతన ఆలయాన్ని గ్రానైట్ రాళ్లతో సుందరంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం దేవాలయ ప్రాంగణమంతా ఎక్కడ చూసినా గ్రానైట్ రాళ్లతో కనిపిస్తోంది.- న్యూస్టుడే, చక్రాయపేట
చేపట్టే పనులు ఇవే..
గండిక్షేత్రంలో ముఖ్యంగా గర్భాలయం, అర్ధ మండపం, మణి మండపం, మహా మండపం నిర్మించనున్నారు. అదేవిధంగా మూడంతస్తుల విమాన గోపురం, గోపురం చుట్టూ అన్ని అంతస్తుల్లోనూ రాతిపై చెక్కించిన విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. పడమటి వైపున ఉన్న పాత రాజగోపురాన్ని తొలగించి కొత్తది నిర్మిస్తారు. వీటన్నింటికీ గ్రానైట్నే వాడనున్నారు. ఆలయ నిర్మాణానికి వాడే మొత్తం 130 రాతి స్తంభాల్లో 24 అనివిటి స్తంభాలు (పిల్లర్లు) మిగిలిన 106 చిత్రకంఠ స్తంభాలు ఏర్పాటు చేస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
పాత ఆలయ నిర్మాణాల తొలగింపు
సీఎం ప్రత్యేక శ్రద్ధ
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం చక్రాయపేట మండలంలో గండి క్షేత్రం ఉండడంతో ఆలయ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ఎంపీ వై.ఎస్. అవినాష్రెడ్డి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తూ నిధులు సకాలంలో వచ్చేట్లు కృషి చేస్తున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
శరవేగంగా నిర్మాణ పనులు
గండి ఆలయాన్ని పడకొట్టే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో రాతి స్తంభాలతో నూతన గర్భగుడి పనులు చేపడతాం. 2023 జూన్ చివరి కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. - ముకుందారెడ్డి, గండి ఆలయ సహాయ కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.