గండి పునర్నిర్మాణ పనులు షురూ!
రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.5 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. తమిళనాడుకు
రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.5 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. తమిళనాడుకు చెందిన నటరాజన్ కన్స్ట్రక్షన్ సంస్థ టెండర్ దక్కించుకుంది. గండిక్షేత్రం కోటి రూపాయలు డిపాజిట్ చేయగా.. దేవాదాయశాఖ సర్వశ్రేయోనిధి నుంచి రూ. 13.5 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం రూ.14.5 కోట్లకు టెండర్లు ఖరారు చేసి గత డిసెంబరులో పనులు మొదలు పెట్టారు. జనవరినెలాఖరుకి ఆలయ కట్టడాలను పడకొట్టడం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నూతన ఆలయాన్ని గ్రానైట్ రాళ్లతో సుందరంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం దేవాలయ ప్రాంగణమంతా ఎక్కడ చూసినా గ్రానైట్ రాళ్లతో కనిపిస్తోంది.- న్యూస్టుడే, చక్రాయపేట
చేపట్టే పనులు ఇవే..
గండిక్షేత్రంలో ముఖ్యంగా గర్భాలయం, అర్ధ మండపం, మణి మండపం, మహా మండపం నిర్మించనున్నారు. అదేవిధంగా మూడంతస్తుల విమాన గోపురం, గోపురం చుట్టూ అన్ని అంతస్తుల్లోనూ రాతిపై చెక్కించిన విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. పడమటి వైపున ఉన్న పాత రాజగోపురాన్ని తొలగించి కొత్తది నిర్మిస్తారు. వీటన్నింటికీ గ్రానైట్నే వాడనున్నారు. ఆలయ నిర్మాణానికి వాడే మొత్తం 130 రాతి స్తంభాల్లో 24 అనివిటి స్తంభాలు (పిల్లర్లు) మిగిలిన 106 చిత్రకంఠ స్తంభాలు ఏర్పాటు చేస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
పాత ఆలయ నిర్మాణాల తొలగింపు
సీఎం ప్రత్యేక శ్రద్ధ
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం చక్రాయపేట మండలంలో గండి క్షేత్రం ఉండడంతో ఆలయ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ఎంపీ వై.ఎస్. అవినాష్రెడ్డి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తూ నిధులు సకాలంలో వచ్చేట్లు కృషి చేస్తున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
శరవేగంగా నిర్మాణ పనులు
గండి ఆలయాన్ని పడకొట్టే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో రాతి స్తంభాలతో నూతన గర్భగుడి పనులు చేపడతాం. 2023 జూన్ చివరి కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. - ముకుందారెడ్డి, గండి ఆలయ సహాయ కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యమే ఉండదన్నావ్.. మధ్యలోనే చంపేస్తున్నావ్..!
[ 08-05-2024]
దశల వారీగా మద్యనిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బార్లు తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేస్తూ జేబులు నింపుకొంటున్నారు. -
కొనసాగిన పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ మూడోరోజు మంగళవారం కొనసాగింది. కడప ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉద్యోగులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. -
పట్టపగలు కాదు...అర్ధరాత్రి మెరుపుల వెలుగు
[ 08-05-2024]
ఈ చిత్రం చూస్తే ఇదేదో పట్టపగలు తీసిందని అనుకుంటారు... కానీ చిమ్మచీకట్లో తీసిన చిత్రమిది... మెరుపు తీగలు నగరానికి నగలా మారగా ఆ వెలుగులు పట్టపగలును తలపించాయి. -
నేడు కలికిరిలో ప్రధాని మోదీ సభ
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొలువుదీరావు... కొంప ముంచావు!
[ 08-05-2024]
నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మీకు సొంత ఇల్లుందా? పోనీ ఇంటి నిర్మాణానికి సెంటు స్థలమైనా ఉందా? వైకాపా ప్రభుత్వం విధించే ఆస్తిపన్నులు చెల్లించడానికి మీ ఆస్తులు సరిపోక పోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నామని సంబరపడే వారికి సంకటం తప్పదు. -
ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 08-05-2024]
తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులే ముద్దనూరులో కనిపిస్తున్నాయని, వైకాపా ప్రభుత్వం చేపట్టింది ఏమీ కనిపించడంలేదని ఎన్డీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు. -
మైనార్టీల హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే
[ 08-05-2024]
మైనార్టీల మతపరమైన సంరక్షణ, వారి హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే అని ముస్లిం సోదరులు అపోహలు వీడి నిశ్చింతగా ఉండాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. -
14 హామీలతో ప్రొద్దుటూరు తెదేపా మేనిఫెస్టో విడుదల
[ 08-05-2024]
ప్రొద్దుటూరు అభివృద్ధి కోరుతూ 14 రకాల ప్రధాన హామీలతో తెదేపా మేనిఫెస్టోను మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. -
గెలిపిస్తే.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతాం
[ 08-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం కృషి చేస్తానని కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. -
అక్రమంగా దాచిన మద్యం స్వాధీనం
[ 08-05-2024]
మండల పరిధిలోని యాదవనగర్ సమీపంలో పంటపొలాల్లో దాచిన తెలంగాణా రాష్ట్రానికి చెందిన 2016 మద్యం సీసాలను సెబ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
దివ్యాంగ ఓటర్లకు చక్రాల కుర్చీలు
[ 08-05-2024]
రానున్న ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల కోసం అధికారులు చక్రాల కుర్చీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపాతో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
[ 08-05-2024]
తెదేపా ప్రభుత్వంలోనే కురబ సామాజిక వర్గానికి భరోసా లభిస్తుందని వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా అన్నారు. -
1950కు ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ కేంద్రం వివరాలు
[ 08-05-2024]
మీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం స్లిప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్. -
యజమాని వేధింపులతో చేనేత కార్మికుడి బలవన్మరణం
[ 08-05-2024]
మగ్గాల యజమాని వేధింపులు భరించలేక ఓ చేనేత కార్మికుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
వడగండ్లు... రైతులకు కడగండ్లు
[ 08-05-2024]
మండలంలోని బూడిదవేడులో సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. దాదాపు 30 ఎకరాల్లో బొప్పాయి, టమాట, వరి తదితర పంటలన్నీ నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM