Lok Sabha Polls: నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్-3 ఎవరంటే?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, కేసులు, ఇతర వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.
దిల్లీ: ఒకవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు, రాజకీయ ప్రచారంతో తెలుగు రాష్ట్రాల్లో వేడి మామూలుగా లేదు. సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) నాలుగో విడతలో భాగంగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మే 13న జరగనుండగా.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలూ అదే రోజు జరగనున్నాయి. వీటితో పాటు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా 96 లోక్సభ స్థానాల్లో ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అగ్రనేతల ప్రచార పర్వం తారస్థాయిలో కొనసాగుతోన్న వేళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) సంస్థ విశ్లేషించి ఆ వివరాలు వెల్లడించింది. అభ్యర్థులు పేర్కొన్న ఆస్తులు, విద్యార్హతలు, క్రిమినల్ కేసుల వివరాలను నివేదికలో పేర్కొంది. నాలుగో విడత ఎన్నికల్లో మొత్తంగా 1,717 మంది బరిలో ఉండగా.. 1710మంది అఫిడవిట్లను విశ్లేషించి గణాంకాలతో నివేదిక రూపొందించింది.
దీని ప్రకారం నాలుగో విడత ఎన్నికల బరిలో ఉన్న ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో 476 మంది (28శాతం) కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. వీరి ఆస్తి రూ.కోటి అంతకన్నా ఎక్కువ ఉన్నట్లు తెలిపింది. భాజపా నుంచి బరిలో నిలిచిన 70 మందిలో 65మంది (93%).. కాంగ్రెస్ నుంచి 61మందిలో 56మంది (92%) కోటీశ్వరులే ఉన్నట్లు తెలిపింది. ఈ విడతలో పోటీ చేస్తోన్న అభ్యర్థి సగటు ఆస్తి ₹11.72 కోట్లుగా పేర్కొంది. భాజపా నుంచి 70మంది బరిలో ఉండగా.. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి ₹101.77 కోట్లు కాగా.. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న 61 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు ₹23.65 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇకపోతే, అత్యధిక ఆస్తులు కలిగి వున్న టాప్- 3 అభ్యర్థుల్లో గుంటూరు తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (రూ.5,705కోట్లకు పైనే), చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (రూ.4,568 కోట్లకు పైనే), నెల్లూరు తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (రూ.716కోట్లకు పైనే) ఉన్నారని తెలిపింది.
21 శాతం మందిపై క్రిమినల్ కేసులు
బరిలో నిలిచిన వారిలో 360 మంది అభ్యర్థుల (21శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. వీటిలో 274 (16 శాతం) మంది అభ్యర్థులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటుండగా.. 11 మందిపై హత్యా నేరం, 50 మందిపై మహిళలపై అత్యాచారాలు వంటి నేరారోపణలు, 44 మందిపై విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలిపింది. విద్యార్హతల విషయానికి వస్తే.. 944 మంది (55శాతం) అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు అభ్యసించగా.. 66 మంది డిప్లొమా, 644 మంది (38శాతం) ఆరు నుంచి 12వ తరగతి వరకు చదివినట్లు పేర్కొంది. 30 మంది కేవలం అక్షరాస్యులుగా మాత్రమే పేర్కొనగా.. 26 మంది నిరక్షరాస్యులుగా అఫిడవిట్లో పేర్కొన్నట్లుగా తెలిపింది. నాలుగో విడత బరిలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో కేవలం 10 శాతం (170) మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అలాగే, 642 మంది అభ్యర్థుల వయస్సు 25 నుంచి 40 (38శాతం) కాగా.. 842 మంది అభ్యర్థుల వయస్సు 41-60 మధ్య (49 శాతం), 226 మంది అభ్యర్థుల వయసు 61 నుంచి 80 ఏళ్లు (13శాతం)గా నివేదిక పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి