డ్రాగన్ కుట్రలు.. ఇతర దేశాల ఎన్నికల్లో చైనా జోక్యం ఇలా..
ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలో చైనా జోక్యం పెరుగుతోంది. డ్రాగన్ కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా.. వాటి ఎన్నికల ప్రక్రియలోనూ వేలు పెడుతోంది. డ్రాగన్పై ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలు చేయగా.. తాజాగా కెనడా కూడా చైనా చర్యలను బట్టబయలు చేసింది. 2019, 2021లో తమ దేశంలో జరిగిన ఫెడరల్ ఎన్నికలను చైనా రహస్యంగా ప్రభావితం చేసిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక తాజగా వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.
అత్యాధునిక పరికరాలతో బీజింగ్ తన రాజకీయ అజెండాలను ఇతర దేశాలపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మక ప్రయోజనాలతో పాటు చైనా ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు పొందడం దాని లక్ష్యం. షీ జిన్పింగ్ ప్రభుత చర్యలు ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ఈ సంవత్సరంలో దాదాపు 64 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున డ్రాగన్ చర్యలను ఓ కంట కనిపెట్టాలని అంటున్నారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ..
ఇన్ఫ్లూయెన్స్ ఆపరేషన్స్(IO) ద్వారా చైనా ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇతర దేశాల నేతలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వారిని బలహీనమైన నేతలుగా ప్రచారం చేయడం ఈ ఐవోలో ప్రధానమైనది. వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా 2017-18 నుంచే చైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. 2023లో మెటా ఈ నెట్వర్క్కు అనుసంధానమైన తొమ్మిది వేల ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలను బ్యాన్ చేసిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకే, అమెరికా, అస్ట్రేలియా లాంటి దేశాలే లక్ష్యంగా 50కిపైగా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లలో ఇలాంటి ప్రచారాలను గుర్తించారు.
అంతిమ లక్ష్యం అదే..
సోషల్ మీడియానే కాకుండా చైనీస్ ఐవో వ్యూహాల్లో ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. రహస్య వ్యూహాలతో చైనా తన కుట్రలను అమలు చేస్తోంది. స్థానిక, స్వతంత్ర మీడియా, రాజకీయ పార్టీలు, వ్యాపార వేత్తలు, ఎన్జీవోలను ప్రభావితం చేయడం ఇందులో భాగం. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం, ఎన్నికైన నేతలు చైనా అనుకూల వైఖరిని అవలంభించేలా చూడటం చైనీస్ ఇన్ఫ్లూయెన్ ఆపరేషన్స్ అంతిమ లక్ష్యం. గత ఏడాది నవంబర్లో చైనాకు లింక్ అయి ఉన్న 5 వేల ఫేక్ సోషల్మీడియా అకౌంట్లపై వేటు వేశారు. అమెరికన్లలా నటిస్తూ ఈ ఖాతాల్లో చైనాకు అనుకూల ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఆస్ట్రేలియాలో 2022 ఫెడరల్ ఎన్నికల సమయంలోనూ డ్రాగన్ ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అదే ఏడాది జరిగిన ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్రలకే పాల్పడినట్లు సమాచారం.
ఏఐతో కూడా..
తాజాగా కృత్రిమ మేధను కూడా వినియోగించి ఫేక్ వీడియోలు, చిత్రాలను సృష్టిస్తోన్నట్లు సమాచారం. చైనాను విమర్శించే పార్టీలు, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న భారత్తోపాటు, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాల్లో ఈ ఏడాది జరిగే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ఏఐని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని మైక్రోసాఫ్ట్ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా చైనా ఈ టెక్నాలజీ వాడి కుట్రలకు పాల్పడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.