గోస.. తీర్చేవారికే బాసట!
ఎడారి దేశాలకు వలస వెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా అదే బాట పడుతోంది.
ఉమ్మడి జిల్లా ఓటర్లలో 11.55 శాతం గల్ఫ్బాధిత కుటుంబాల వారే!
నిర్మల్, న్యూస్టుడే: ఎడారి దేశాలకు వలస వెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా అదే బాట పడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళ్తుండటంతో.. వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్న వారు కొందరైతే.. క్షణికావేశంతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది.
ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబాల ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 1,96,400 మంది గల్ఫ్ బాధిత కుటుంబాల్లో ఓటర్లు ఉండగా.. మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీంలలో 60 వేల మంది వరకు ఓటర్లు ఉంటారని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు, కన్నీళ్లు మిగులుతున్నాయి. తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక, సరైన పనిదొరకక, అక్కడి ప్రభుత్వాలు విధించిన చట్టాల కారణంగా.. కొందరు రెక్కలు విరిగిన పక్షుల్లా స్వగ్రామాలకు చేరుతున్నారు. మరికొందరు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణిస్తుండగా, ఇంకొందరు అజ్ఞాతవాసంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు గల్ఫ్లో ఉన్న వారితోపాటు తిరిగొచ్చిన వారిని, కుటుంబాలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం
గల్ఫ్ వలస కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు లేదా ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) అమలు చేయాలని ఇందుకోసం ఓటు అనే ఆయుధంతో కార్మికుల కుటుంబాలు అభ్యర్థుల గుర్తించేలా చేయాలని ఆయా దేశాల్లోని బాధితులు సూచిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గల్ఫ్ అంశాన్ని గుర్తించే అభ్యర్థులను, పార్టీలను చేరదీయాలని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం ఓటర్లలో 11.55 శాతం మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెందిన వారున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నాయి.
ఇవీ కార్మికుల డిమాండ్లు
- గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలి
- కేరళ తరహాలో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
- గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, జీవిత, ప్రమాద బీమా, పింఛన్తో కూడిన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి
- గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి
- కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్లో సౌదీ, యూఏఈ, కువైట్ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి
- గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెందిన పిల్లల కోసం రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తూ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి.
- గల్ఫ్లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ద్వారా వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్లో మరణించిన వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలి
నిర్మల్ అసెంబ్లీ బరిలో స్వదేశ్ పరికిపండ్ల
గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలన్న డిమాండ్తో ఈ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గ స్థానానికి ప్రవాసీమిత్ర కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పోటీ చేయనున్నారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బీఫారం తెచ్చుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?