ధరావతులకే రూ.30 లక్షలు!.. గిన్నిస్ లక్ష్యంగా పద్మరాజన్ నామినేషన్లు
గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగేవారు కొందరైతే... ఉనికి చాటేందుకు పోటీ చేసే వారు మరికొందరు. ఈ రెండూ కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంతో... తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన కె.పద్మరాజన్(60) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగేవారు కొందరైతే... ఉనికి చాటేందుకు పోటీ చేసే వారు మరికొందరు. ఈ రెండూ కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంతో... తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన కె.పద్మరాజన్(60) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కేవలం అతిరథులపైనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం విశేషం. వీటి నామినేషన్ల కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. మెట్టూరులో టైర్ల దుకాణం నిర్వహిస్తున్న పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకుని, ప్రస్తుతం అన్నామలై ఓపెన్ వర్సిటీ నుంచి ఎంఏ(హిస్టరీ) చేస్తున్నారు. ఇప్పటివరకు లోక్సభ, శాసనసభల ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థులు, రాష్ట్రపతి ఎన్నికల్లో కలిపి 237 నామినేషన్లు వేశారు. వివిధ కారణాలతో వాటిలో ఎక్కువ శాతం తిరస్కరణకు గురయ్యాయి. సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 4న నామినేషన్ వేశారు. సోమవారం స్క్రూటినీ అనంతరం అది తిరస్కరణకు గురైంది. ఆయన పోటీ చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటక, దిల్లీ ఉండగా, పోటీ పడిన ప్రముఖుల్లో వాజ్పేయీ, కరుణానిధి, జయలలిత, రాహుల్గాంధీ, వైఎస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్లపై బరిలోకి దిగారు. 1991లో నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీకి నామినేషన్ వేశారు.
న్యూస్టుడే, గజ్వేల్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
‘సిరా’ చుక్క కథ... తెలుసునా ఓటరూ..!
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్