కమ్యూనిస్టు యోధుడు.. పెండ్యాల
ఒక గ్రామ సర్పంచిగా గెలిచేందుకే నేతలు కుస్తీ పడుతున్న రోజులవి. అంగ, అర్థ బలాలున్న వారికి సైతం ప్రజాప్రతినిధి కావడం కలగానే ఉంటుంది.
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్టుడే : ఒక గ్రామ సర్పంచిగా గెలిచేందుకే నేతలు కుస్తీ పడుతున్న రోజులవి. అంగ, అర్థ బలాలున్న వారికి సైతం ప్రజాప్రతినిధి కావడం కలగానే ఉంటుంది. అలాంటిది ఒకే వ్యక్తి ఒకే సమయంలో రెండు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాల్లో గెలిచారంటే మీరు నమ్మగలరా..! 70 ఏళ్ల క్రితమే వరంగల్ జిల్లాలో ఈ సంచలనం జరిగింది. దేశంలోనే ఈ అరుదైన రికార్డు సాధించిన వ్యక్తి పేరే పెండ్యాల రాఘవరావు..
సామాజిక స్పృహ ఎక్కువ
హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటాలతో పాటు జాయిన్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న కమ్యూనిస్టు యోధుడు పెండ్యాల రాఘవరావు. మార్చి 15, 1917న ఇప్పటి జనగామ జిల్లా చిన్నపెండ్యాలలో జన్మించారు. హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. అప్పట్లో నిజాం రాజ్యంలో వరంగల్ సుభా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. రాఘవరావు కమ్యూనిస్టుల ప్రభావంతో ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులు కావడంతో.. చదువుకు దూరమయ్యారు. అప్పుడప్పుడే వరంగల్లో విస్తరిస్తున్న ఆర్య సమాజ్ శాఖల్లో పని చేశారు. అంటరానితనానికి వ్యతిరేకంగా తన గ్రామంలో ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించడం ఆయన సామాజిక స్పృహకు నిదర్శనం.
చిన్నపెండ్యాలలో ఏర్పాటు చేసిన రాఘవరావు విగ్రహం
జైలు నుంచే నామినేషన్..
1948లో హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలిపేందుకు పోలీస్ యాక్షన్ జరిపారు. అనంతరం ఏర్పడిన జే.ఎన్.ఎస్ చౌదరి ఆధ్వర్యంలో మిలటరీ ప్రభుత్వం కమ్యూనిస్టులపై నిర్బంధం విధించింది. ఆ సమయంలో రాఘవరావు 1950లో వరంగల్ జిల్లా మల్కాపూర్ వద్ద అరెస్టు అయ్యారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు జైలులోనే ఉన్నారు. అక్కడి నుంచే వరంగల్ లోక్ సభ స్థానానికి, వర్ధన్నపేట, హనుమకొండ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ వేశారు.
వరంగల్ ఎంపీగా కాళోజీపై గెలుపు
హనుమకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బీకే రెడ్డిపై 6,628 ఓట్లతో, వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సి.రావుపై 2,803 ఓట్లతో, వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రజాకవి కాళోజీపై 3,613 ఓట్లతో విజయం సాధించారు. అనంతరం పార్టీ సూచన మేరకు హనుమకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాలను వదులుకొని వరంగల్ ఎంపీగా కొనసాగారు. దేశంలో సంస్థానాలను విలీనం చేసినప్పుడు జమీందార్లు, జాగీర్దార్లకు భారత ప్రభుత్వం నష్ట పరిహారం కింద రూ.లక్షల్లో పారితోషికం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
‘నా ప్రజా జీవితం’ పేరిట ఆత్మకథ
ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన చిన్నపెండ్యాలలో 1987 సెప్టెంబర్ 10న ఆయన మరణించారు. రాఘవరావు చనిపోయిన 20 ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె కొండపల్లి నీహరిణి రాఘవరావు గురించిన అనేక వివరాలతో 2007లో ‘నా ప్రజా జీవితం’ పేరిట ఆత్మకథను ప్రచురించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే