icon icon icon
icon icon icon

Kishan Reddy: ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాం: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 05 May 2024 12:52 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోదీకి ఓటేశారని చెప్పారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవన్నారు. కాంగ్రెస్‌ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని భాజపా సరిదిద్దిందని చెప్పారు. అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మిదిన్నరేళ్లు పరిపాలించినట్లు తెలిపారు. తమ హయాంలో మత కలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవన్నారు. భాజపా పాలనలో దేశం మొత్తం శాంతి నెలకొందని వివరించారు. 

‘‘ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాం. ప్రస్తుతం తినడానికి తిండి లేక ఆ దేశం భిక్షమెత్తుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో దేశంలో రహదారులు నిర్మిస్తున్నాం. రూ.1.02 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారులు నిర్మించాం. భాజపా హయాంలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశాం. 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌ అందిస్తున్నాం. 13 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించాం. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తయారవుతోంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img