icon icon icon
icon icon icon

MP Laxman: కాంగ్రెస్‌, భారాస ప్రచారాన్ని ప్రజలు నమ్మరు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఆయన మాటల్లో పస లేదని ప్రజలు గుర్తించారన్నారు.

Updated : 01 May 2024 13:01 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఆయన మాటల్లో పస లేదని ప్రజలు గుర్తించారన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, భారాస నేతల ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. ఆఖరికి ఫేక్‌ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్‌రెడ్డి దిగజారారని విమర్శించారు.

రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారన్నారు. రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా చూస్తామని మోదీ, అమిత్‌షా చెప్పారని గుర్తుచేశారు. దాన్ని మార్చే ప్రసక్తే లేదని తమ పార్టీ అగ్రనేతలు చెప్పారని.. అంబేడ్కర్‌ను అవమానించేలా రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలే రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించారని లక్ష్మణ్‌ విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img