నరసాపురం
నరసాపురం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరి స్థానం.
లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ నియోజకవర్గంలో పరిధిలో (Narasapuram Lok Sabha constituency) ఏడు అసెంబ్లీ శాసనసభా స్థానాలు ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీలు దీని కిందికి వస్తాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించగా.. తెదేపా 4, భాజపా 2, వైకాపా, సీపీఐ చెరోసారి గెలుపొందాయి.
ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 14.62 లక్షల మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 7.17 లక్షలు, మహిళలు 7.44 లక్షలు, ట్రాన్స్జెండర్లు 74 మంది ఉన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వి.వి. శివరామరాజుపై వైకాపా అభ్యర్థి రఘురామ కృష్ణరాజు 32,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత పార్టీలో తనకు ఎదురైన పరిణామాల నేపథ్యంలో రఘురామ వైకాపాకు దూరంగా ఉంటూ వచ్చారు.
ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా నరసాపురం భాజపాకు వెళ్లింది. దీంతో ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను బరిలో దించింది. భాజపా నుంచి రఘురామ కృష్ణరాజు పేరు బలంగా వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా భాజపా సీనియర్ నేత వర్మ తెర మీదకు వచ్చారు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ ఎంతోకాలం నుంచి పార్టీలో ఉంటూ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు. పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు వైకాపా అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. ఆమె న్యాయవాది. 1995 నుంచి ఆమె క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఉమాబాల తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం గమనార్హం. ఇక కాంగ్రెస్ నుంచి కొర్లపాటి బ్రహ్మానందనాయుడు బరిలో నిలిచారు
- ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
- 1957 - ఉద్దరాజు రామమ్ (సీపీఐ)
- 1962 - దాట్ల. బలరామరాజు (కాంగ్రెస్)
- 1967 - దాట్ల. బలరామరాజు (కాంగ్రెస్)
- 1971 - ఎం.టి.రాజు (కాంగ్రెస్)
- 1977 - అల్లూరి. సుభాష్ చంద్రబోస్ (కాంగ్రెస్)(ఐ)
- 1980 - అల్లూరి. సుభాష్ చంద్రబోస్ (కాంగ్రెస్)(ఐ)
- 1984 - భూపతిరాజు. విజయ్కుమార్ రాజు (తెదేపా)
- 1989 - భూపతిరాజు. విజయ్కుమార్ రాజు (తెదేపా)
- 1991 - భూపతిరాజు. విజయ్కుమార్ రాజు (తెదేపా)
- 1996 - కొత్తపల్లి. సుబ్బారాయుడు(తెదేపా)
- 1998 - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్)
- 1999 - కృష్ణం రాజు (భాజపా)
- 2004 - చేగొండి. హరి రామ జోగయ్య (కాంగ్రెస్)
- 2009 - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్)
- 2014 - గోకరాజు గంగరాజు(భాజపా)
- 2019 - రఘురామ కృష్ణరాజు (వైకాపా)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
తిరుపతి
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి -
కర్నూలు
కర్నూలు లోక్సభ నియోజకవర్గం (Kurnool Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్ కేటగిరీలోనే ఉంది. -
కాకినాడ
కాకినాడ లోక్సభ నియోజకవర్గం1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది (Kakinada Lok Sabha constituency) జనరల్ కేటగిరిలోనే ఉంది. -
ఏలూరు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది (Eluru Lok Sabha constituency) జనరల్ కేటగిరిలో ఉంది. -
రాజంపేట
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం (Rajampet Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
అరకు
అరకు లోక్సభ నియోజకవర్గం (Araku Lok Sabha constituency) 2008లో ఏర్పడింది. -
చిత్తూరు
చిత్తూరు లోక్సభ నియోజకవర్గం (Chittoor Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. -
అనకాపల్లి
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం (Anakapalli Lok Sabha constituency) 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
గుంటూరు
గుంటూరు లోక్సభ నియోజకవర్గం (Guntur Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. జనరల్ కేటగిరీలో ఉంది. -
మచిలీపట్నం
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం (Machilipatnam Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. -
అనంతపురం
అనంతపురం లోక్సభ నియోజక వర్గంలో (Anantapur Lok Sabha constituency) మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. -
విజయవాడ
విజయవాడ లోక్సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
కడప
కడప లోక్సభ నియోజకవర్గం (Kadapa Lok Sabha constituency) 1952లో ఆవిర్భవించింది. ఇది మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది. -
హిందూపురం
హిందూపురం లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. -
విశాఖపట్నం
విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
విజయనగరం
విజయనగరం లోక్సభ నియోజకవర్గం 2008లో పునర్విభజన సమయంలో ఏర్పడింది. -
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని ఏకైక లోక్సభ నియోజకవర్గం (Srikakulam Lok Sabha constituency) ఇది. 1952లో ఏర్పాటైన ఈ స్థానం జనరల్ కేటగిరిలో ఉంది. -
అమలాపురం
అమలాపురం లోక్సభ నియోజకవర్గం (Amalapuram Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. -
ఒంగోలు
ఒంగోలు లోక్సభ నియోజకవర్గం (Ongole Lok Sabha constituency)1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరి.
తాజా వార్తలు
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం