మొన్న పూరీ.. నేడు చండీగఢ్.. నిధులు లేవని టికెట్లను వెనక్కి ఇచ్చేస్తున్న నేతలు
చివరి నిమిషంలో అభ్యర్థులు వీడుతుండటం ఆయా పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ.. పోలింగ్కు ముందే పలు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిధుల కొరత కారణంగా పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. డబ్బులు లేవని, పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని పార్టీలను వీడుతున్నారు. మొన్న కాంగ్రెస్కు ఓ అభ్యర్థి ఇలాంటి షాకే ఇవ్వగా.. తాజాగా శిరోమణి అకాలీదళ్ ఆ జాబితాలో చేరింది.
శిరోమణి అకాలీ దళ్ చండీగఢ్ లోక్సభ అభ్యర్థి హర్దీప్ సింగ్ సైనీ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని, నేతల నుంచి మద్దతు కొరవడిందని కారణాలు చెబుతూ ఆయన పార్టీని వీడారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఒక్క రోజు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రచారం చేసుకోవడానికి తనకు పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదనీ.. పార్టీ పెద్దలు తనకు మద్దతుగా నియోజకవర్గానికి రావడం లేదని ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీ చండీగఢ్ యూనిట్కు అధ్యక్షుడైన సైనీ.. తన టికెట్ను ఇతరులకు ఇవ్వాలని కోరారు. ఆయన భాజపాలో చేరనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో చివరి దశలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది.
తొలిసారి పోటీ.. అంతలోనే..
ఇక సైనీ నిష్క్రమణతో ఈ నియోజకవర్గంలో భాజపా, కాంగ్రెస్ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ తమ అభ్యర్థిని నిలబెట్టడం శిరోమణి పార్టీకి ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ భాజపా అభ్యర్థులకు ఆ పార్టీ మద్దత్తు ఇస్తూ వచ్చింది. రైతు చట్టాలపై విభేదాల కారణంగా 2021లో రెండు పార్టీల మధ్య బంధం తెగింది.
మొన్న పూరీలో..
ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతీ కూడా ఇటీవల ఇవే కారణాలు చెప్పి తన టికెట్ను వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రచారం కోసం పార్టీ నుంచి తనకు నిధులు అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా ఖర్చులను భరించే స్తోమత లేకపోవడంతో, పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు.
తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు..
చివరి నిమిషంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటుండంతో.. ఏం చేయాలో తెలియక ఆ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో ప్రత్యర్థి పార్టీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లు అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకుని భాజపాలో చేరడంతో అక్కడ హస్తం పార్టీ పోటీలో లేకుండా పోయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్