Gannavaram: గన్నవరంలో 144 సెక్షన్.. తెదేపా నిరసనకు అనుమతి లేదు: ఎస్పీ జాషువా
గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా దాడి ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
విజయవాడ: గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా దాడి ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం జరిగిన ఘటనల నేపథ్యంలో తెదేపా నిర్వహించతలపెట్టిన ‘చలో గన్నవరం’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని చెప్పారు. విజయవాడలో మీడియాతో ఎస్పీ మాట్లాడారు.
సోమవారం గన్నవరం తెదేపా కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకరావు తలకు గాయమైందని ఎస్పీ చెప్పారు. తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి దృశ్యాలను పరిశీలిస్తున్నామని.. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. గన్నవరం పీఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు వివరించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసన కార్యక్రమాలలు చేపట్టొద్దని ఆయన కోరారు.
పట్టాభి ఇంటికి పోలీసులు.. భర్తతో వీడియో కాల్ మాట్లాడించాలని కోరిన భార్య
మరోవైపు విజయవాడలోని పట్టాభి ఇంటికి పోలీసులు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గన్నవరం కోర్టుకు ఆయన్ను తీసుకొస్తామని పట్టాభి సతీమణి చందనకి చెప్పారు. పట్టాభితో వీడియో కాల్ మాట్లాడించాలని ఆమె కోరగా.. అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో డీజీపీని కలిసేందుకు చందన బయల్దేరారు. అయితే బైక్పై బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!