బెంగాల్ దుర్గా ఉత్సవాల నిబంధనల్లో సడలింపు!
పశ్చిమబెంగాల్ ప్రజలకు అత్యంత ముఖ్యమైన దుర్గా వేడుకల ప్రారంభానికి ఒకరోజు ముందు కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గా పూజ మండపాలపై తీసుకున్న ‘నో ఎంట్రీ జోన్’ ఆదేశాలను కాస్త సడలింపులు చేస్తూ మంగళవారం తాజా నిర్ణయం తీసుకుంది.
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రజలకు అత్యంత ముఖ్యమైన దుర్గా వేడుకల ప్రారంభానికి ఒకరోజు ముందు కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గా పూజ మండపాలపై తీసుకున్న ‘నో ఎంట్రీ జోన్’ ఆదేశాలను కాస్త సడలింపులు చేస్తూ మంగళవారం తాజా నిర్ణయం తీసుకుంది. పెద్ద మండపాల వద్ద 45 మంది పూజలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేసింది. ‘నో ఎంట్రీ’ నిబంధనలు సడలించాలంటూ దుర్గామాత ఉత్సవాల ఫోరం సభ్యులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువరించింది. ‘పెద్ద మండపాల వద్ద 45 మంది, చిన్న మండపాల వద్ద 15 మందిని ఏకకాలంలో అనుమతించాలి. లోపలికి అనుమతించే వ్యక్తుల జాబితాను ప్రతిరోజూ ఉదయం 8గంటలకు మండపం బయట ప్రచురించాలి. 300 చదరపు గజాల పరిధిలో ఉన్న పెద్ద మండపాల వద్ద 60 మందితో జాబితా చేయాలని.. అయినప్పటికీ ఒకేసారి 45 కంటే ఎక్కువ మందిని అనుమతించేది లేదు. మండపాల సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలి’ అని కోర్టు స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా..పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ మండపాలను సందర్శకులకు నో ఎంట్రీ జోన్లుగా మార్చాలని కోల్కతా హైకోర్టు సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. అన్ని మండపాల ప్రవేశ ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. సాధారణంగా బెంగాల్లో దుర్గాపూజ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజులలో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పరిస్థితుల ప్రభావం కారణంగా ఆంక్షలు విధిస్తే మంచిదని హైకోర్టు సోమవారం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్