కాత్యాయని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం భ్రమరాంబ దేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయని అమ్మవారికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో..

Updated : 22 Oct 2020 21:35 IST

శ్రీశైలం ఆలయం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం భ్రమరాంబ దేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయని అమ్మవారికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూజలు నిర్వహించారు. అక్క మహాదేవి అలంకరణ మండపంలో మల్లికార్జున స్వామి-అమ్మవార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు పుష్పార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి-అమ్మవార్ల ఉత్సవం వైభవంగా జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని