చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు

చిత్తూరు జిల్లా సోమల మండలంలో భూప్రకంపనలు కలకలం రేపాయి.

Published : 17 Nov 2020 21:59 IST

సోమల: చిత్తూరు జిల్లా సోమల మండలంలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఏటివన్‌, ఉప్పరపల్లి, కమ్మపల్లి, శిలంవారిపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధిలో మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. నిలుచున్న వ్యక్తులు కిందపడిపోయినట్లు అనిపించడం.. శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ఇళ్లలో పాత్రలు కిందపడటంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని