గుమ్మాడీ గుమ్మాడి.. గిన్నిస్ కెక్కిన గుమ్మడి!
నెటిజన్లు తెగపొగిడేస్తున్న ఈ గిన్నిస్ గుమ్మడిని మీరూ చూసేయండి మరి!
ఇంటర్నెట్ డెస్క్: హాలోవీన్ అనేది పాశ్చాత్య దేశాల్లో అత్యుత్సాహంగా జరుపుకునే పండుగ. దీనిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న మరణించిన వారి పట్ల గౌరవాన్ని తెలియచేసేందుకు జరుపుకొంటారు. కాగా దీనిని భారతదేశంలోనూ ఇటీవల జరుపుకొంటున్నారు. ఆ రోజు చిన్నారులు ‘ట్రిక్ ఆర్ ట్రీట్’ అంటూ మన దసరా పండుగలో పిల్లల మాదిరిగానే కానుకలు వసూలు చేస్తారు. ఇక అన్నిటినీ మించి ‘జాక్ ఓ లాంతర్న్’ అని పిలిచే గుమ్మడి కాయ ఈ పండుగకు ప్రత్యేక అలంకారం. ఇందుకుగాను ప్రతి ఇంట్లో ఓ గుమ్మడి కాయను కన్ను, ముక్కు, నోరు, ఆకృతులు కనబడేలా తొలిచి, లోపల దీపం వెలిగిస్తారు. దీనిని తయారు చేసేందుకు పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటారు. కాగా, ఈసారి హాలోవీన్ పండుగ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద హాలోవీన్ గుమ్మడి కాయను గురించి ప్రకటించింది.
942 కేజీలకు పైగా బరువున్న ఈ గుమ్మడి జోసియా బ్రాంట్ అనే వ్యక్తి పొలంలో పండిందట. ఇక దీనిని 2018లో కాలిఫోర్నియాలో జరిగిన ఓ ఫెస్టివల్ కోసం మైక్ బ్రౌన్, డీన్ ఆర్నాల్డ్, బ్రాండీ డేవిస్ అనే వ్యక్తులు కలిసి చెక్కినట్టు గిన్నిస్ సంస్థ స్పష్టం చేసింది. మనిషి ముఖం ఆకారంలో చెక్కిన దీనిలోపల మరో ప్రత్యేకత ఉంది. అద్భుతంగా, భారీగా ఉందంటూ నెటిజన్లు తెగపొగిడేస్తున్న ఈ గిన్నిస్ గుమ్మడిని మీరూ చూసేయండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!