Ruturaj Gaikwad: జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ధర్మశాల వేదికగా పంజాబ్ను చిత్తు చేసింది. హైబ్రిడ్ విధానంలో రూపొందించిన పిచ్పై తొలిసారి మ్యాచ్ జరిగింది. బౌలర్లకు పూర్తి సహకారం అందించడంతో బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
‘‘ప్రతి ఒక్కరూ పిచ్ గురించి స్పందించిన తీరు ఒకేలా ఉంది. చాలా మందకొడిగా ఉంది. బౌన్స్ కావడం లేదు. మేం బ్యాటింగ్ ప్రారంభానికి ముందు కనీసం 180 నుంచి 200 పరుగులైనా చేయాలని అనుకున్నాం. కొన్ని వికెట్లను చేజార్చుకున్నాక ఇక్కడ 160+ స్కోరు చేసినా సరిపోతుందని భావించాం. సిమర్జిత్ అద్భుతంగా బంతులేశాడు. ఈ సీజన్కు ముందు కూడా 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన అనుభవం అతడి సొంతం. కానీ, ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇప్పుడేమీ మరింత ఆలస్యం కాలేదు. మొదట ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటర్ను తీసుకుందామని అనుకున్నాం. కనీసం 15 పరుగులైనా చేస్తాడు. జట్టుకు ఉపయోగపడతాడనేది అంచనా. కానీ, బౌలర్ అయితే రెండు లేదా మూడు వికెట్లు తీస్తే మ్యాచ్పై పట్టు సాధించేందుకు అవకాశం దక్కుతుంది. మా జట్టులో కొందరు క్రికెటర్లు జ్వరంతో బాధపడ్డారు. మరికొందరు గాయాలతో ఉన్నారు. మ్యాచ్ ముందు వరకు తుది జట్టులో ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఎదురైంది. చివరికి విజయం సాధించడం మరింత ఆనందంగా ఉంది. కీలక సమయంలో పాయింట్ల పట్టికలో పైకి చేరాం’’ అని రుతురాజ్ తెలిపాడు.
మేం బౌలింగ్ బాగానే చేశాం.. కానీ: కరన్
‘‘బౌలింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందుల్లేవు. రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. సగం మ్యాచ్ వరకు మేం ఆధిక్యంలోనే ఉన్నాం. కానీ, బ్యాటింగ్ సమయంలో గందరగోళానికి గురై ఓటమిపాలయ్యాం. మేం అనుకున్నదానికంటే వికెట్ చాలా స్లోగా ఉంది. కనీసం పేస్, బౌన్స్ ఎక్కువ ఉంటుందని భావించాం. తర్వాత బెంగళూరును ఢీకొట్టనున్నాం. పుంజుకొని ఆ మ్యాచ్కు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది’’ అని పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ (Sam Curran) వెల్లడించాడు.
ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యం: తుషార్
‘‘తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో మేం గొప్ప విజయాన్ని నమోదు చేయగలిగాం. గత మ్యాచ్లో మాకు పెద్దగా కలిసి రాలేదు. ఈ సారి మాత్రం ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. ధర్మశాలలో పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని తెలుసు. కానీ, మరీ ఇంత నెమ్మదిగా మారుతుందని అనుకోలేదు. సరైన లెంగ్త్తో కూడిన బౌలింగ్ చేస్తేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ షాట్లను కొట్టడం తేలికైన విషయం కాదు. కొత్త బంతితో త్వరగా వికెట్లను తీసేందుకు ప్రయత్నించి సఫలం కావడం ఆనందంగా ఉంది’’ అని చెన్నై బౌలర్ తుషార్ దేశ్పాండే (Tushar Deshpandey) అన్నాడు. పంజాబ్పై తుషార్ 4 ఓవర్ల కోటాలో 35 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లను పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
Bengaluru vs Chennai - Rain: బెంగళూరు, చెన్నై మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది. -
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు సన్నాహకం జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐదు రోజులకే తొలి పోరు జరగనుంది. -
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. -
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM