Shreyas Iyer: టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ పాయింట్ల పట్టికలో కోల్కతా అగ్రస్థానానికి చేరుకుంది. లఖ్నవూపై 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ విక్టరీతో దాదాపు ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. గత ఆరు మ్యాచుల్లో ప్రతిసారి కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ను ఓడిపోయాడు. అయితే, రెండు మినహా నాలుగు మ్యాచుల్లో కోల్కతా విజేతగా నిలిచింది. లఖ్నవూతో పోరు అనంతరం శ్రేయస్ ఇదే విషయంపై స్పందించాడు.
‘‘మాకు మరోసారి పవర్ప్లేలో గొప్ప శుభారంభం దక్కింది. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడేశారు. మా టైమౌట్ సమయంలో ఈ పిచ్పై 200 స్కోరు చేస్తే సరిపోతుందని నరైన్ అన్నాడు. కుడి, ఎడమ కాంబినేషన్తో ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బంది అవుతుంది. మేం చాలా మ్యాచుల్లో టాస్ ఓడిపోయాం. కానీ, విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మా బౌలర్లు కట్టుదిట్టంగా ప్రణాళికలను అమలు చేశారు. ఎప్పటికప్పుడు ప్లాన్స్ను మార్చుకుంటూ ముందుకు సాగాం. అన్క్యాప్డ్ ప్లేయర్లకు స్వేచ్ఛ ఇస్తే మరింత అద్భుతంగా రాణిస్తారు. కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. సానుకూల దృక్పథంతో మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది’’ అని శ్రేయస్ తెలిపాడు.
సపోర్ట్ స్టాఫ్ వల్లే ఇదంతా: నరైన్
‘‘టోర్నీలో మేం మెరుగైన స్థితిలో ఉన్నాం. ప్రతి మ్యాచ్లోనూ శుభారంభం చేయడం ముఖ్యం. అయితే, బ్యాక్ఎండ్లో సిబ్బంది సహకారం చాలా అవసరం. వారి వల్లే ఇలా రాణించేందుకు ఆస్కారం కలుగుతుంది. మన బలాలను గుర్తెరిగి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకోవాలి. ప్రతిసారీ వర్కౌట్ అవుతుందని అనుకోలేం. కానీ, ప్రయత్నం మాత్రం మానుకోకూడదు. వరుణ్ చక్రవర్తి అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తాడు. అతడు వికెట్లను తీయడంతోనే నా పని సులువైంది. జట్టులోని ప్రతి ఆటగాడు తమను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సవాళ్లను ఎదుర్కొని జట్టును విజయపథంలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు’’ అని సునీల్ నరైన్ తెలిపాడు. బ్యాటింగ్లో 81 పరుగులు చేసిన నరైన్... బౌలింగ్లో ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఐపీఎల్లో అత్యధిక పరుగుల తేడాతో (98 రన్స్) విజయం సాధించడం కోల్కతాకిది మూడోసారి. బెంగళూరుపై (2008లో) 140 పరుగులు, దిల్లీపై (2024లో) 106 పరుగుల తేడాతో గెలిచింది.
- కోల్కతా తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న వారిలో ఆండ్రి రస్సెల్తో (15) సునీల్ నరైన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
- ఐపీఎల్లో లఖ్నవూ ఇదే అత్యధిక తేడాతో ఓడిన మ్యాచ్. గతంలో (2023) చెన్నై చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు గుజరాత్ చేతిలో (2022, 2023), రెండుసార్లూ 62 పరుగుల తేడాతో ఓడింది.
- ఐపీఎల్లో కోల్కతా - లఖ్నవూ మధ్య ఐదు మ్యాచ్లు జరిగాయి. తొలి మూడింట్లో లఖ్నవూ గెలవగా.. తర్వాత రెండు మ్యాచుల్లో కోల్కతా విజయం సాధించింది. ఐపీఎల్ 2024 సీజన్లో సొంతమైదానం వేదికగా జరిగిన ఏడు మ్యాచుల్లో లఖ్నవూ విజయాల నిష్పత్తి 4-3గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం