Ravindra Jadeja: పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్ మీద బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా (POTM) నిలిచాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) పేరిట ఉన్న రికార్డును రవీంద్ర జడేజా అధిగమించాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున అత్యధిక POTMలను అందుకొన్న క్రికెటర్గా జడేజా అవతరించాడు. ఇప్పటి వరకు ధోనీ 15 సార్లు అవార్డులను దక్కించుకోగా.. జడేజా 16వ సారి సొంతం చేసుకున్నాడు. వీరిద్దరి తర్వాత సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (11), మైక్ హస్సీ (10) ఉన్నారు. పంజాబ్పై జడేజా 43 పరుగులు చేయడంతోపాటు 3 వికెట్లను తీశాడు. మ్యాచ్ అనంతరం జడేజా పిచ్ పరిస్థితిపై స్పందించాడు.
‘‘డే టైమ్లో జరిగిన మ్యాచ్లో వికెట్ స్లోగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. వేడి వల్ల నెమ్మదిగా ఉంటుందని భావించాం. కానీ, పిచ్ నుంచి బ్యాటర్లకు పెద్దగా సహకారం లేకుండాపోయింది. అందుకే, నేను బ్యాటింగ్ చేసే సమయంలో 40 పరుగుల పార్టనర్షిప్ను నిర్మిస్తేనే మ్యాచ్లో మేం పోటీనివ్వడానికి ఉంటుందని అనుకున్నా. బంతి పాతబడే కొద్దీ బ్యాట్ మీదకు సరిగ్గా రాలేదు. కొత్త పిచ్పై ఆడేటప్పుడు ఎలా స్పందిస్తుందో అర్థం కాదు. బ్యాటింగ్లో 15 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. త్వరగా వికెట్లను కోల్పోవడం వల్ల ఇన్నింగ్స్ నెమ్మదించింది. అయితే, మేం బౌలింగ్ చేసే సమయానికి ఆ స్కోరు సరిపోతుందని అర్థమైంది’’ అని జడేజా తెలిపాడు.
తొలిసారి 9వ స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్
టీ20 కెరీర్లో ఎంఎస్ ధోనీ తొలిసారి 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇప్పటి వరకు ఎక్కువగా వన్ డౌన్ నుంచి 7వ స్థానంలోపే క్రీజ్లోకి అడుగు పెట్టేవాడు. ఈ సీజన్లో ఒకసారి 8వ స్థానంలోనూ బ్యాటింగ్కు వచ్చాడు. కానీ, పంజాబ్తో మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ తర్వాత ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే, 19వ ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన ధోనీని హర్షల్ పటేల్ వేసిన స్లో బంతితో క్లీన్బౌల్డ్ చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ కావడంతో అభిమానులు నిరాశకు గురి చేశారు. ప్రస్తుత ఎడిషన్లో ధోనీ ఔట్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పంజాబ్పైనే రెండుసార్లూ పెవిలియన్కు చేరాడు. గత మ్యాచ్లోనూ రనౌట్ అయిన విషయం తెలిసిందే.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు
- ఒక ఐపీఎల్ మ్యాచ్లో అత్యధికసార్లు 40+ స్కోరు - మూడు వికెట్లు తీసిన మూడో బౌలర్ రవీంద్ర జడేజా. షేన్ వాట్సన్ (3), యువరాజ్ సింగ్ (3)ని సమం చేశాడు. వీరి తర్వాత ఆండ్రి రస్సెల్ (2) ఉన్నాడు.
- ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఇరు జట్ల వికెట్ కీపర్లు డకౌట్ కావడం ఇది ఐదోసారి. చెన్నై తరఫున ధోనీ, పంజాబ్ ఆటగాడు జితేశ్ శర్మ సున్నాకే పెవిలియన్కు చేరారు. ఇంతకుముందు రాజస్థాన్-ముంబయి (2010), ముంబయి - రాజస్థాన్ (2012), ముంబయి -హైదరాబాద్ (2018), గుజరాత్ - దిల్లీ (2023) మ్యాచుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
- పంజాబ్ సొంతమైదానాల్లో ఘోరంగా విఫలమైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. గతేడాది కూడా ఏడింట్లో ఒక్కటి గెలిచి.. ఆరు ఓటములను చవిచూసింది.
- పంజాబ్పై చెన్నై దాదాపు మూడేళ్ల తర్వాత గెలిచింది. 2021 సీజన్లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు 28 రన్స్తో గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.