శబరిమల: ఇక నిత్యం 5వేల మందికి దర్శనం!
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న దృష్ట్యా శబరిమల వెళ్లే యాత్రికులు కొవిడ్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్(టీబీడీ) వెల్లడించింది.
తిరువనంతపురం: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న దృష్ట్యా శబరిమల వెళ్లే యాత్రికులు కొవిడ్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్(టీబీడీ) వెల్లడించింది. డిసెంబర్ 26తేదీ నుంచి వచ్చే భక్తులు కరోనా వైరస్ ఆర్టీ పీసీఆర్ టెస్ట్లో వచ్చిన నెగటివ్ రిపోర్టును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం 2 వేల మందిని అనుమతిస్తుండగా.. శని, ఆదివారాల్లో మాత్రం రోజు 3వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక వచ్చేవారం నుంచి రోజు 5వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమల క్షేత్రాన్ని దర్శించేందుకు కేరళ హైకోర్టు అనుమతించింది.
మార్గదర్శకాల ప్రకారం, ఆర్టీ-పీసీఆర్ విధానంలో కొవిడ్ పరీక్ష చేయించుకుని.. నెగటివ్ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే శబరిమల దర్శనానికి అనుమతిస్తామని టీడీబీ అధ్యక్షుడు ఎన్ వాసు వెల్లడించారు. అంతకుముందు కేవలం యాంటీజెన్ టెస్టులో పరీక్ష రిపోర్టు ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించారు. కానీ, డిసెంబర్ 31 నుంచి జనవరి 19 వరకు జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) పండుగ వేళ నెగటివ్ రిపోర్టు(RTPCR) లేని భక్తలను కొండపైకి అనుమతించమని టీబీడీ బోర్డు అధ్యక్షుడు స్పష్టంచేశారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకొన్నట్టుగా ఉన్న కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయంలో ప్రతిఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఇదిలాఉంటే, శబరిమల ఆలయానికి కేరళ ప్రభుత్వం రూ.50కోట్లను అందించినట్లు టీడీబీ వెల్లడించింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల