హైదరాబాద్లో ట్రాపిక్ ఆంక్షలు
మహా నిమజ్జనానికి భాగ్య నగరం సిద్ధమైంది. వివిధ రూపాల్లో కొలువుదీరి, పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు కొద్ది గంటల్లో గంగ ఒడికి చేరనున్నారు..
నేడే మహా నిమజ్జనం
సాగర్కు తరలిరానున్న వినాయకుడి విగ్రహాలు
హైదరాబాద్: మహా నిమజ్జనానికి భాగ్య నగరం సిద్ధమైంది. వివిధ రూపాల్లో కొలువుదీరి, పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు కొద్ది గంటల్లో గంగ ఒడికి చేరనున్నారు. నలుమూలల నుంచి విగ్రహాలు బాలాపూర్ గణేష్తో కలిసి ప్రధాన మార్గంలో పయనించి హుస్సేన్ సాగర్లో మంగళవారం నిమజ్జనం కానున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్పై పోలీసులు 21 క్రేన్లను సిద్ధం చేశారు.
ఉదయం 10.30కు ఖైరతాబాద్ గణపతి ఊరేగింపు
ఖైరతాబాద్: హైదరాబాద్ మహా నిమజ్జనమనగానే ఖైరతాబాద్ భారీ గణేషుడే గుర్తుకొస్తాడు. ఈసారి ఖైరతాబాద్ గణపతి ఊరేగింపు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు
నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని అదనపు సీపీ(ట్రాఫిక్) ఎస్.అనిల్ కుమార్ తెలిపారు. నిమజ్జన ప్రక్రియ పూర్తికాకపోతే ఆంక్షలను పొడిగించనున్నామని వివరించారు.
* ప్రధాన రహదారులపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.
* నెక్లెస్రోడ్, అప్పర్ ట్యాంక్బండ్లపై నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు.
* విమానాశ్రయానికి వెళ్లేవారు.. వచ్చేవారు.. బాహ్యవలయ రహదారి మీదుగా రాకపోకలు కొనసాగించడం శ్రేయస్కరం. ఇమ్లీబన్, జేబీఎస్లకు రాకపోకలు సాగించే జిల్లాల బస్సులు ఊరేగింపు లేని మార్గాలను ఎంచుకోవాలి.
ప్రజలు, భక్తులు సమాచారం కోసం 040-2785 2482, 9010203626
ప్రజలు సహకరించాలి
నారాయణగూడ, కవాడిగూడ, న్యూస్టుడే: గణేష్ శోభాయాత్ర శాంతియుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు తమకు పూర్తి సహకారం అందించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. అడుగడుగునా గట్టి నిఘా, పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగర పోలీసు అధికారులతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్బండ్ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల్లో సుమారు 30,000 ప్రతిమలు నిమజ్జనం అయ్యాయన్నారు. తొమ్మిది అడుగుల లోపు ఉన్నవి సుమారు 4,000 విగ్రహాలు నేడు ట్యాంక్బండ్ వస్తాయని భావిస్తున్నామన్నారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
వాహనాల మళ్లింపు
- సీపీ మహేష్ భగవత్
నేరేడ్మెట్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చెరువుల వద్ద మంగళవారం నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి ఏరాట్లు చేసినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు వాహనాలు దారి మళ్లిస్తున్నామన్నారు. విగ్రహాలు నిర్దేశిత మార్గాల్లో చెరువుల వద్దకు చేరుకోవాలని కోరారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
బాలాపూర్ వినాయకుడి ఊరేగింపుతో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 18 కి.మీ. కొనసాగే యాత్ర మార్గాన్ని నిరంతరం పరిశీలించేందుకు వీలుగా అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదనంగా ప్రతి పోలీస్ ఠాణా పరిధిలోని ప్రజలు, కాలనీ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ‘‘నేను సైతం’’ పేరుతో ఏర్పాటు చేసుకున్న కెమెరాలను అనుసంధానించారు. భారీ విగ్రహాలు లేకపోవడంతో ఈసారి నిమజ్జన ఘట్టం వేగంగా పూర్తయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్