రామమందిరానికి 300 కిలోల తాళం!
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన వృద్ధ దంపతులు ఏకంగా 300 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేశారు. రామమందిరం రక్షణ కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు....
రూపొందించిన వృద్ధ దంపతులు
అలీగఢ్: అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా భక్తులు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కొందరు విరాళాలు సమర్పిస్తుంటే మరికొందరు తమ నైపుణ్యమే పెట్టుబడిగా కానుకలు సమర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన వృద్ధ దంపతులు ఏకంగా 300 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేశారు. రామమందిరం రక్షణ కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. అలీగఢ్కు చెందిన ప్రకాశ్ శర్మ, రుక్మిణి శర్మ దంపతులకు తాళాలు చేయడంలో విశేష అనుభవం ఉంది. 40 ఏళ్లుగా వారు ఆ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాళాలతోపాటు ఇతర వస్తువులు.. ఇనుము, వెండి, రాగి, ఇత్తడితో మన్నికైన వస్తువులు తయారు చేయడంలో వీరు దిట్ట. లాక్డౌన్ కాలంలో పనిలేక సతమతమవుతున్న తమకు ఆ శ్రీరాముడు గొప్ప పని కల్పించాడని ప్రకాశ్ శర్మ పేర్కొన్నారు.
300 కిలోలున్న ఈ భారీ తాళం తయారీకి ఇనుము, రాగి, ఇత్తడి మిశ్రమాన్ని వినియోగించినట్లు ప్రకాశ్ శర్మ పేర్కొన్నారు. దీన్ని రూపుదిద్దేందుకు దాదాపు ఏడాది సమయం పట్టిందన్నారు. రోజుకు 8 గంటలు శ్రమించి ఈ భారీ తాళం తయారుచేశామని తెలిపారు. తాళం చెవి బరువు దాదాపు 20 కిలోలు ఉంటుందన్నారు. ఈ మొత్తం తయారీ కోసం రూ.లక్ష వరకు వెచ్చించినట్లు వెల్లడించారు. రామాలయం కోసం తాళం తయారుచేయడం సంతోషంగా ఉందని ఆ వృద్ధ దంపతులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!