CM Jagan: వైఎస్ఆర్, రోశయ్య ఇద్దరూ మంచి స్నేహితులు: సీఎం జగన్
విద్యార్థి నాయకుడి నుంచి సీఎం, గవర్నర్ వరకు వివిధ స్థాయుల్లో కొణిజేటి రోశయ్య ప్రజా జీవితంలో కొనసాగారని..
అమరావతి: విద్యార్థి నాయకుడి నుంచి సీఎం, గవర్నర్ వరకు వివిధ స్థాయుల్లో కొణిజేటి రోశయ్య ప్రజా జీవితంలో కొనసాగారని.. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా నిలిచారని ఏపీ సీఎం జగన్ అన్నారు. కొద్దిరోజుల క్రితం మృతి చెందిన మాజీ సీఎం రోశయ్య సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. మాజీ సభ్యుల మృతిపై సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనూ ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారని.. వాళ్ల మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. వైఎస్, రోశయ్య ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. అలాంటి రోశయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమని.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్ చెప్పారు.
ఇటీవల మృతిచెందిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతున్నట్లు సీఎం చెప్పారు. వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్ఎస్ చౌదరి, కడప ప్రభాకర్రెడ్డి, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్ అనసూయమ్మ, పాటిల్ వేణుగోపాల్రెడ్డి, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, యడ్లపాటి వెంకట్రావు మృతికి సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సూచనతో శాసనసభలో సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్