ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ..

Updated : 27 Jan 2021 16:06 IST

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్‌, డీజీపీ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ,అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ.. అధికారులతో సమీక్షిస్తున్నారు.

ఈ నెల  29 నుంచి తొలిదఫా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. నామపత్రాల దాఖలు కోసం ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా.. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఎస్‌ఈసీ సమాలోచనలు చేస్తున్నారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసి ఎన్నికల నిర్వహణకు తీసుకుంటోన్న చర్యలను ఎస్‌ఈసీ, సీఎస్‌ విడివిడిగా కలిసి వివరించారు.

ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ఒకేసారి నిర్వహించడం సమస్యే: డీజీపీ

ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ఒకేసారి నిర్వహించడం సమస్యే అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఈ సమస్యను అధిగమించడంపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు.  జిల్లాల్లో పోలీసు బలగాల సన్నద్ధతపైనా చర్చించినట్లు తెలిపారు. ఎన్నికలతోపాటు పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉందన్నారు. ఒకే సమయంలో పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్‌ సమస్యగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ గుర్తించామని.. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి..
గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్‌ఈసీ

ద్వివేది, గిరిజా శంకర్‌ల అభిశంసన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని