Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
గాడితప్పిన ఆహారపు అలవాట్లు.. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు, పొగ, మద్యం వ్యసనంతో కడుపులో అల్సర్లు ఏర్పడుతాయి. పొట్టలోని మ్యూకోజ పొరకు చిరుగులు ఏర్పడటంతో తరచూగా తీవ్రమైన మంట, కడుపునొప్పి వస్తుంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: గాడితప్పిన ఆహారపు అలవాట్లు.. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు, పొగ, మద్యం వ్యసనంతో కడుపులో అల్సర్లు ఏర్పడుతాయి. పొట్టలోని మ్యూకోజ్ పొరకు చిరుగులు ఏర్పడటంతో తరచూగా తీవ్రమైన మంట, కడుపునొప్పి వస్తుంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, దాని తీరుతెన్నులను గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సోమశేఖర్రావు వివరించారు.
సమస్యలు ఇలా ఉంటాయి..
* పెద్ద పేగుల్లో అల్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటుంది. చిన్న పేగుల్లోనూ అల్సర్లు వస్తాయి.
* బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో అల్సర్లు ఏర్పడుతున్నాయి. కలుషిత ఆహారం, నీటితో వస్తుంది. అధికంగా పెయిన్ కిల్లర్ వాడినా రానున్నాయి.
* అన్నం తినగానే కడుపులో నొప్పి వచ్చినపుడు అల్సర్లు వస్తాయని తెలుసుకోవాలి. ట్యాబ్లెట్లు వేసుకుంటే తాత్కాలికంగా తగ్గినా తర్వాత ఇబ్బంది పడొచ్చు. ఎండోస్కోపీ చేస్తే వ్యాధి తీవ్రత తెలుస్తుంది.
* మందులతోనే ఎక్కువగా తగ్గిపోతాయి. మళ్లీ అల్సర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* బయటి ఆహారం తీసుకోవద్దు. నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడి నీటిని తాగొద్దు.
* గ్యాస్ ట్యాబ్లెట్లను దీర్ఘకాలికంగా వాడొద్దు. కారం, మసాలాలు ఎక్కువగా తినొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు