Chandrababu: రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు సీఐడీ విచారణ

తెదేపా అధినేత చంద్రబాబుకు రెండోరోజు సీఐడీ విచారణ కొనసాగుతోంది.

Updated : 24 Sep 2023 10:36 IST

రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు సీఐడీ విచారణ రెండోరోజు కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది అధికారుల బృందం.. రాజమహేంద్రవరం జైలులోకి వెళ్లింది. కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై చంద్రబాబును అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో విచారణ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు భోజన విరామం ఇవ్వనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని