CII: ఆ ప్రతిపాదనను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకోవాలి: కేటీఆర్కు సీఐఐ లేఖ
నెలకు ఒక్కో మెగావాట్కు రూ.2,37,500 గ్రిడ్ మద్దతు ఛార్జీలను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని.. దీని వల్ల పరిశ్రమలు నష్టపోయే అవకాశాలున్నాయని
హైదరాబాద్: నెలకు ఒక్కో మెగావాట్కు రూ.2,37,500 గ్రిడ్ మద్దతు ఛార్జీలను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని.. దీని వల్ల పరిశ్రమలు నష్టపోయే అవకాశాలున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఈనెల 2న రాసిన లేఖలో సీఐఐ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారు. పరిశ్రమలకు సంబంధించి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకునే ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల ఎక్కడా ఈ తరహా ఛార్జీలు లేవన్నారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు మెగావాట్కు రూ.20వేల నుంచి రూ.30వేల లోపే ఉన్నాయని వెల్లడించారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం విధించాలనుకున్న గ్రిడ్ సపోర్ట్ ఛార్జీల కారణంగా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. దానివల్ల పరిశ్రమల మధ్య పోటీతత్త్వంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు సైతం ఇది విఘాతంగా మారుతుంది. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి గ్రిడ్ మద్దతు ఛార్జీలను క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించాయి. దీనివల్ల సిమెంట్, పేపర్, మెటలర్జికల్ సంబంధిత కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఇతర క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్పై ప్రభావం పడుతుంది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్పై గ్రిడ్ మద్దతు ఛార్జీలను వేయాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి’’ అని సీఐఐ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!