Vijayawada: సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated : 17 Feb 2024 18:12 IST

విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందువల్ల ఎవరూ విజయవాడకు రావొద్దని సూచించారు. నగరంలో సెక్షన్‌ 30, 144 అమల్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చలో విజయవాడలో పాల్గొనవద్దని సూచించారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించి పాల్గొంటే అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు