Lucknow vs Mumbai: లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్. గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు. ఏప్రిల్ 30న ముంబయి ఇండియన్స్తో జరగనున్న కీలక మ్యాచ్లో ఈ యువ సీమర్ ఆడే అవకాశం ఉంది. ‘‘మాయాంక్ యాదవ్ ఫిట్గా ఉన్నాడు. అన్ని ఫిట్నెస్ టెస్టులు పాసయ్యాడు. ఇది నిజంగా మాకు గుడ్న్యూస్. ముంబయితో జరిగే మ్యాచ్లో అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశముంది’’ అని లఖ్నవూ బౌలింగ్ కోచ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన వేగంతో మయాంక్ యాదవ్ ఆకట్టుకున్నాడు. నిలకడగా 150+ కి.మీ వేగంతో బంతులేస్తూ స్టార్ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచాడు. ఏప్రిల్ 7న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఒక్క ఓవర్ మాత్రమే విసిరి గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్లో బెంగళూరుపై 156.7 కి.మీ వేగంతో మయాంక్ బంతిని విసిరాడు. 2024 సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైన బాల్ కావడం విశేషం. పంజాబ్పైనా 155.8 కి.మీ స్పీడ్తో బంతిని వేశాడు.
ముంబయికి చావోరేవో
లఖ్నవూతో జరిగే మ్యాచ్ ముంబయి ఇండియన్స్కు చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరడానికి దారులు దాదాపు మూసుకుపోయినట్లే. ప్రస్తుతం ముంబయి 9 మ్యాచ్లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించింది. మిగిలిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిస్తే ముంబయి ముందంజ వేసి ప్లేఆఫ్స్కు ఆశలు సజీవంగా ఉంచుకొంటుంది. లఖ్నవూకు కూడా ఇది కీలకమైన మ్యాచే. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్ల్లో 5 విజయాలు, 4 ఓటములతో ఉంది. ముంబయిపై నెగ్గితే లఖ్నవూ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. మయాంక్ యాదవ్ ఆడితే ఆ జట్టుకు మరింత బలం చేకూరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?