సచివాలయం కోసం విశాఖలో భవనాల వేట
విశాఖలో వివిధ శాఖల రాష్ట్ర కార్యాలయాల కోసం ఉన్నతాధికారులు వెతుకులాట ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, ఇతర ప్రతినిధులు గత కొన్ని రోజులుగా విశాఖకు వస్తున్నారు. విశాఖలో
విశాఖపట్నం: విశాఖలో వివిధ శాఖల రాష్ట్ర కార్యాలయాల కోసం ఉన్నతాధికారులు వెతుకులాట ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, ఇతర ప్రతినిధులు గత కొన్ని రోజులుగా విశాఖకు వస్తున్నారు. విశాఖలో సచివాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉందని భావిస్తున్న మిలీనియం టవర్ భవనాన్ని పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ ఎండీ రజత్భార్గవ బుధవారం పరిశీలించారు. మిలీనియం టవర్ వెనుక భాగంలో నిర్మిస్తున్న టవర్-బి పనుల ప్రగతిని పరిశీలించారు. మిలీనియం టవర్లో ఉన్న వసతుల గురించి ఏపీఐఐసీ అధికారులు వివరించారు. రెండో టవర్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయాలపైనా చర్చించారు. నగరానికి వచ్చిన ఆయన్ను పలువురు ఐఏఎస్లు మర్యాదపూర్వకంగా కలిసి సంప్రదింపులు జరిపారు.
ఐటీహిల్స్లోనే ఉన్న కనకదుర్గా హెల్త్ సర్వీసెస్ సంస్థ భవనాన్ని వ్యవసాయ మార్కెటింగ్శాఖ అధికారులు పరిశీలించారు. ఆ భవనంలో వసతుల గురించి భవన యజమాని సాంబశివరావుతో సంప్రదింపులు జరిపారు. ఐటీహిల్స్లోనే సుమారు 1.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చేలా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం వద్దకు పలు శాఖల అధికారులు వెళ్తున్నారు. ఆ భవనం మొత్తాన్ని అద్దెకు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు