తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు

 తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున సూర్యప్రభ వాహనంపై

Updated : 01 Feb 2020 10:44 IST

 

 తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రూపాల్లో మాడ వీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. శనివారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 7 వాహనాలపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీవారికి చినశేషవాహన సేవ, 11 గంటలకు గరుడ సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని