ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 500 యూనిట్లు పైబడిన వారికి యూనిట్కు 90పైసలు చొప్పున పెంచింది. 500 యూనిట్లు పైబడిన వారికి గతంలో రూ.9.05పైసలుగా ఉండగా.. ప్రస్తుతం రూ.9.95పైసలుగా టారిఫ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 500 యూనిట్లు పైబడిన వారికి యూనిట్కు 90పైసలు చొప్పున పెంచింది. 500 యూనిట్లు పైబడిన వారికి గతంలో రూ.9.05పైసలుగా ఉండగా.. ప్రస్తుతం రూ.9.95పైసలుగా టారిఫ్ నిర్ణయించారు. విద్యుత్ ఛార్జీల పెంపు భారం కార్పొరేట్ సంస్థలతో పాటు రాష్ట్రంలోని 1.35లక్షల గృహ వినియోగదారులపై పడనుంది.
సబ్సిడీ తగ్గించే మార్గాలను అన్వేషిస్తాం..
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సింగరేణి భవన్లో ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి రూ.14,349.07 కోట్ల ఆదాయం అవసరమవుతుందని అంచనావేసినట్లు చెప్పారు. ఈలోటును భర్తీ చేసేందుకు విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు వెల్లడించారు. పెంచిన విద్యుత్ ఛార్జీల కారణంగా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలపై రూ.13 00 కోట్ల భారం పడుతుందని తెలిపారు. వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థల నికర లోటు రూ.10,060.63 కోట్లుగా నిర్థారించినట్లు వెల్లడించారు. వ్యవసాయ వినియోగదారులకు రూ.8,353.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపామన్నారు. రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని, అందువల్లే..ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. ఈసారి వ్యవసాయానికి పక్కా ప్రణాళిక రూపొందించామని, ప్రభుత్వ పాలసీ ప్రకారం రైతులకు 9గంటల విద్యుత్ ఇస్తామన్నారు. ప్రభుత్వ సబ్సిడీ పెరిగిందని, క్రమంగాసబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామన్నారు. లోటు పాట్లు ఉంటే వచ్చే ఏడాది సరిదిద్దుకుంటామని
నాగార్జునరెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు