కరోనాపై ఉపాసన జాగ్రత్తలు
సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే ఉపాసన కొణిదెల తాజాగా కరోనా వైరస్పై పలు జాగ్రత్తలు చెప్పారు. హైదరాబాద్లో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినప్పటి నుంచి అందరూ ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే రామ్చరణ్ సతీమణి ఉపాసన తాజాగా కరోనా వైరస్పై పలు జాగ్రత్తలు చెప్పారు. హైదరాబాద్లో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినప్పటి నుంచి అందరూ ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్, ఇన్స్టాగ్రామ్లలో పోస్టు చేశారు.
‘సికింద్రాబాద్లోని అపోలో ఆసుపత్రిలో కరోనా కేసు గుర్తించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ రోగిని గాంధీ ఆసుపత్రికి తరలించాం. అక్కడ ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. ప్రభుత్వం పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు సూచనలు చేశారు. అవేంటంటే..
* జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటివి ఈ వ్యాధికి లక్షణాలు. వీటిల్లో ఏమైనా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోండి.
* ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. అయినా సరే మాస్కులు ధరించడం మంచిది.
* బయట తిరిగి వచ్చిన తర్వాత, తినే ముందు శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
* ఈ వైరస్కు యాంటీ బయాటిక్స్ లేవు. కాబట్టి వైద్యులు చెప్పకుండా ఎలాంటి మాత్రలు వేసుకోవద్దు.
* దగ్గు, తుమ్ములు వచ్చే వాళ్ల నుంచి కనీసం 3 అడుగులు దూరంగా ఉండండి.
* వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించండి.
* ఉడకబెట్టని మాంసం తినవద్దు అంటూ ఉపాసన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!