కరోనా ఎఫెక్ట్ ..వీడియో నాణ్యత హాంఫట్..!
కరోనా ఎఫెక్ట్ కారణంగా అకస్మాత్తుగా అంతర్జాల వినియోగం పెరిగింది. వైరస్ కట్టడిలో భాగంగా ఇళ్లకే పరిమితమైన చాలామంది ప్రజలు అంతర్జాలంలో గడుపుతున్నారు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఎఫెక్ట్ కారణంగా అకస్మాత్తుగా అంతర్జాల వినియోగం పెరిగింది. వైరస్ కట్టడిలో భాగంగా ఇళ్లకే పరిమితమైన చాలామంది ప్రజలు అంతర్జాలంలో గడుపుతున్నారు. ముఖ్యంగా భారత్లో మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాల వినియోగం పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో కరోనా కారణంగా చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. కొందరు ఇళ్ల దగ్గర నుంచి తమ పనులు చేసుకుంటున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ గణాంకాల ప్రకారం సగటు నెలవారీ వైర్లెస్ డేటా వినియోగం వచ్చే రెండు త్రైమాసికాలలో 17 శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి టెలికాం రంగ సంస్థలకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టనుందని వారు అంటున్నారు.
వివిధ టెలికాం రంగ సంస్థల వద్ద డిమాండ్కు తగిన సప్లయ్ చేసే సామర్థ్యం లేదని అంచనా వేస్తున్నారు. హెచ్డీ వీడియోలు, వీడియో కాల్స్కు అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు. అయితే డిమాండ్కు తగ్గ సరఫరా చేసే సామర్థ్యం తమకు ఉందని కొన్ని సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. వివిధ దేశాలలో నెట్ వాడకం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ వాడకం పెరిగిందని ఆ సంస్థ సీఈవో మార్క్ జూకర్బర్గ్ తెలిపారు.
నూతన సంవత్సరం రోజు ఫేస్బుక్కు ఉండే డిమాండ్ను కరోనా అధిగమించిందని ఆయన వెల్లడించారు. ఐరోపా సమాఖ్యలో రాబోయే 30 రోజుల పాటు తమ వీడియో నాణ్యతను తగ్గించనున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. దీని కారణంగా నెట్వర్క్ ట్రాఫిక్ 25 శాతం తగ్గుతుందని భావిస్తోంది. యూట్యూబ్ సైతం నెట్ఫ్లిక్స్ దారిలోనే పయణించనున్నట్లు ప్రకటించింది. డేటా ప్రసారాలకు సంబంధించి మౌలిక సదుపాయాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు వైఫై, హాట్స్పాట్లను ఏర్పాటు చేయాలని ఫైబర్ కేబుల్ విస్తరణకు సహకరించాలని టెలికాం సంస్ఠలు కోరుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!