మా బిడ్డకు ఆ పోలీస్ అధికారి పేరు పెట్టుకున్నాం!
నాకు తొలిసారి పుట్టిన బిడ్డకు ఆ దేవుడి పేరే మొహమ్మద్ రణ్విజయ్ ఖాన్ అని పెట్టుకున్నాము.
బరేలీ: కరోనా వైరస్ నిరోధానికి దేశమంతా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో... అత్యవసర పరిస్థితిలో ఉన్న భార్యా బిడ్డలను చేరుకోవటానికి సహాయం చేసిన ఓ పోలీసు అధికారి పేరునే తమ బిడ్డకు పెట్టుకున్నారు ఆ దంపతులు. మానవత్వం, కృతజ్ఞత వంటి ఉత్తమ గుణాలకు కుల, మత భేదాలేవీ అడ్డురావని నిరూపించే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
తమన్నా ఖాన్ అనే మహిళ బరేలీలో నివసిస్తున్నారు. కాగా ఆమె భర్త అనీజ్ ఖాన్ లాక్డౌన్ కారణంగా నొయిడాలో ఉండిపోవాల్సి వచ్చింది. నెలలు నిండి ప్రసవానికి సమయం దగ్గరపడటంతో ఆ మహిళ... తన అసహాయ స్థితిని వివరిస్తూ బరేలీ పోలీసు ఉన్నతాధికారులకు వీడియో మెసేజ్ను పంపారు. ఇందుకు స్పందించిన అధికారులు నొయిడా ఏడీసీపీ రణ్విజయ్ సింగ్ను సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి అనీజ్ ఖాన్ బరేలీ చేరుకునేందుకు ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీనితో ఆ వ్యక్తి తన భార్యను సరైన సమయంలో చేరుకోగలిగారు.
‘‘నిజానికి సోషల్ మీడియా ద్వారా వీడియో మెసేజ్ పంపేటప్పుడు నాకు సహాయం లభిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. కానీ నా పాలిట పోలీసులు రియల్ హీరోలుగా నిలిచారు. అమితమైన బాధ్యతలు, ఒత్తిడులు ఉన్నా రణ్విజయ్ సార్ మా జీవితాలకు అమిత విలువనిచ్చారు. నా భర్తను స్వయంగా కలిసి, ఆపద సమయంలో నన్ను చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. అందుకే నాకు తొలిసారి పుట్టిన బిడ్డకు ఆ మానవతావాది పేరే మహమ్మద్ రణ్విజయ్ ఖాన్ అని పెట్టుకున్నాము.’’ అని తమన్నా కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!