‘జొమాటో, స్విగ్గీ’తో కూరగాయల సరఫరా!
వినియోగదారులందరికీ కూరగాయలు అందేలా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విస్తృత చర్యలు తీసుకుంది. ఇందుకు ఇప్పటికే సంచార రైతు బజార్లను ప్రారంభించగా
రైతుబజార్లలో రద్దీ తగ్గించేందుకు ప్రయత్నాలు
హైదరాబాద్: వినియోగదారులందరికీ కూరగాయలు అందేలా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విస్తృత చర్యలు తీసుకుంది. ఇందుకు ఇప్పటికే సంచార రైతు బజార్లను ప్రారంభించగా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నగరంలో ఆన్లైన్ ఆర్డర్లపై ఆహారాన్ని ఇళ్లకు సరఫరా చేసే జొమాటో, స్విగ్గీతో పాటు పలు సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. సూపర్ మార్కెట్లు సైతం ఇళ్లకు సరకులు సరఫరా చేసేలా చూడాలని దిశానిర్దేశం చేసింది.
నగరంలో మరిన్ని విక్రయ కేంద్రాలు
నగరంలో ఇప్పుడున్న 12 రైతు బజార్లలో రద్దీని నియంత్రించడం కత్తిమీద సాములా మారింది. ఉదయం వేళ వేలాదిగా తరలివస్తున్న కొనుగోలుదారుల వల్ల కరోనా వ్యాప్తికి అవకాశాలుండడంతో.. నగరంలో మరిన్ని అమ్మక కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి చెప్పారు. 177 వాహనాల ద్వారా 331 ప్రాంతాల్లో సంచార రైతుబజార్లను నగరంలో ప్రారంభించామని తెలిపారు. వారాంతపు సంతలు కూడా ఏర్పటు చేస్తున్నామన్నారు. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పారిశుద్ధ్యానికి రూ.27.90 లక్షలు
రైతుబజార్లతోపాటు హోల్సేల్ మార్కెట్లలో పారిశుద్ధ్యం కోసం రూ. 27.90 లక్షలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కేటాయించింది. మరుగుదొడ్లు, క్యాంటిన్ల వద్ద శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు లిక్విడ్ సోప్లు అందుబాటులో ఉంచేందుకు ఈ నిధులను ఇప్పటికే అందజేశామన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాలోగానీ, ధరల విషయంలోగానీ ఎలాంటి ఇబ్బందులున్నా 100 నంబరుకు ఫోను చేసి ఫిర్యాదు చేయవచ్చునని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM