బస్సులు నడవకున్నా.. బాధ్యత తీసుకున్నారు
టికెట్టు కొట్టిన చేతులు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగస్వామ్యులయ్యాయి. స్టీరింగ్ పట్టిన చేతులు సామాజిక దూరంపై అవగాహన కల్పిస్తున్నాయి. చైనా మహమ్మారిని..
చిత్తూరు: టికెట్టు కొట్టిన చేతులు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగస్వామ్యులయ్యాయి. స్టీరింగ్ పట్టిన చేతులు సామాజిక దూరంపై అవగాహన కల్పిస్తున్నాయి. చైనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు మేము సైతం అంటున్నారు.. చిత్తూరు జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు. కండక్టర్లు, డ్రైవర్లు సైనికుల్లా మారి పోలీసులకు సహకారం అందిస్తున్నారు.
వినూత్న ఆలోచన..
లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు వినూత్నంగా ఆలోచించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో పోలీసులతో కలిసి పనిచేస్తూ.. ప్రజలకు సామాజిక దూరం, కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
పోలీస్ స్టేషన్లకు అనుసంధానం
జిల్లా వ్యాప్తంగా 14 ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో పని చేస్తున్న సుమారు 731 మంది ఉద్యోగులను ఈ సేవలకుగానూ ఆర్టీసీ స్వచ్ఛందంగా కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వీరిని అనుసంధానం చేసింది. పోలీసులకు అవసరమైన చోట వీరు సహకారం అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈవిధంగా ప్రజాసేవలో భాగస్వాములు కావడం గర్వకారణమని ఆర్టీసీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్