Trading hours: ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
Trading hours: స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ సమయం పొడిగించే అంశాన్ని సెబీ తిరస్కరించింది.
Trading hours | ముంబయి: డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ సమయం (trading hours) పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చేసిన ప్రతిపాదనను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) పక్కనపెట్టింది. స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీలో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ కుమార్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కార్యకలాపాలు మధ్యాహ్నం 3.30 గంటలతో ముగుస్తున్నాయి. క్యాష్, ఎఫ్అండ్ఓ సెగ్మెంట్లో ట్రేడింగ్ కూడా అదే సమయంతో నిలిచిపోతోంది.
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు వీలుగా తొలి దశలో ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ను సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించాలని ఎన్ఎస్ఈ సెబీకి ప్రతిపాదించింది. రెండో దశలో రాత్రి 11.30 గంటల వరకు, మూడో దశలో క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ గంటలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని తన ప్రతిపాదనల్లో పేర్కొంది. దేశీయ కాలమానం ప్రకారం.. మన మార్కెట్ల అనంతరం యూరోపియన్ మార్కెట్లు ప్రారంభమవుతాయి. అమెరికా మార్కెట్లు రాత్రి 7 గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం) తెరుచుకుంటాయి. దీనివల్ల మార్కెట్ అనంతరం అంతర్జాతీయంగా ఏదైనా పరిణామం జరిగితే.. దానికి అనుగుణంగా ట్రేడర్లు అప్రమత్తం అవ్వడానికి వీలుంటుందని ఎన్ఎస్ఈ పేర్కొంది.
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
ఎన్ఎస్ఈ చేసిన ఈ ప్రతిపాదన పట్ల కొందరు స్టాక్ బ్రోకర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. ట్రేడింగ్ సమయం పెంపు వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల అదనపు మ్యాన్ పవర్ కూడా అవసరం పడుతుందని, నిర్వహణ పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంప్రదాయ స్టాక్ బ్రోకర్లు సెబీకి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. డిస్కౌంట్ బ్రోకర్లు మాత్రం గడువు పొడిగింపునకు మొగ్గు చూపారు. ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని సెబీ పక్కనపెట్టింది. భవిష్యత్లో బ్రోకర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ట్రేడింగ్ సమయం పెంపు పట్టాలెక్కే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..