మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి 

కుమురం భీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(63) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన తెరాస తరఫున

Updated : 09 Apr 2020 12:58 IST

కాగజ్‌నగర్‌ టౌన్‌‌: కుమ్రం భీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(63) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన తెరాస తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ మాజీ ఛైర్మన్లు విద్యావతి, దస్తగిరి, వివిధ పార్టీల నాయకులు సమ్మయ్య మృతి పట్ల  సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని