T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండటంతో ఆయా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. తాజాగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్ల వివరాలను వెల్లడించాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ పొట్టి ప్రపంచకప్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇక సౌతాఫ్రికా విషయానికొస్తే ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఐసీసీ ఈవెంట్లో మార్క్రమ్ కెప్టెన్సీ చేపట్టడం ఇదే మొదటిసారి. SAటీ20 టోర్నమెంట్లో అదరగొట్టిన అన్క్యాప్డ్ ప్లేయర్లు ర్యాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్మాన్ను ప్రపంచకప్నకు ఎంపిక చేశారు. 530 పరుగులతో రికెల్టన్ SAటీ20లో టాప్ స్కోరర్గా నిలిచాడు. బార్ట్మాన్ 8 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.
ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోకియా, వికెట్కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇటీవల ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరికి చోటు దక్కలేదు. నోకియా వెన్ను గాయం కారణంగా సెప్టెంబర్ 2023 నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. డి కాక్ 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు 2022లో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కొయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోకియా, కగిసో రబాడ, తబ్రెయిజ్ షంసి, ట్రిస్టన్ స్టబ్స్.
ట్రావెలింగ్ రిజర్వ్: నంద్రి బర్గర్, లుంగి ఎంగిడి.
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.
న్యూజిలాండ్ జట్టు: విలియమ్సన్, ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, బ్రాస్వెల్, చాప్మన్, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డరిల్ మిచెల్, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
ప్లేఆఫ్స్ తొలి పోరు... రైడర్స్పై సన్ ‘రైజ్’ అయితే ఫైనల్కు!
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ (Sunrisers Hyderabad)ను కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఢీకొంటుంది. -
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసునని.. అది జట్టుకు కచ్చితంగా ఉపయోగపడుతుందని వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra: ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, కోహ్లీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కింగ్ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ స్టేజ్ను దాటి ప్లేఆఫ్స్ పోరు మొదలుకానుంది. అనూహ్య ఫలితాలతో నాకౌట్కు చేరి ఆశ్చర్చపరిచిన జట్లూ ఉన్నాయి. -
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
ఐపీఎల్ ముగిసిన తర్వాత.. దాదాపు వారం రోజుల్లో భారత ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. -
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్స్కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. -
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు